ఒంటిమిట్ట
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఈ మండలం ‘ఏకశిలానగరం’ అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడున్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి.