శ్రీశైలం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో నల్లమల కొండల్లో ఈ పట్టణం వుంది. ఇది హిందువులకు చాలా పవిత్ర మైన ప్రదేశం. కృష్ణ నది ఒడ్డున వున్న ఈ పట్టణాన్ని.. ఎంతో పవిత్ర యాత్రా స్థలంగా భావించి లక్షలాది హిందువులు వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడి దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి.