కాశ్మీర్లో జవాన్ల కాల్పులు.. వర్ధమాన క్రికెటర్ మృతి

 

ఉత్తర కాశ్మీర్లోని హంద్వారాలో కాల్పుల కలకలం రేగింది. ఆందోళనకారులపై జవాన్లు దాడివలన ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఓ వర్ధమాన క్రికెటర్ నయీం అనే యువకుడు మరణించినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. కళాశాల నుండి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్ధిని పట్ల జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారంటూ స్థానికులు ఆందోళనలు చేపట్టారు. దీంతో జవాన్లు వారిపై కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందారు. అయితే జవాన్లు మాత్రం ముందుగా స్థానికులే తమపై రాళ్లతో దాడి చేశారని.. ఆ తర్వాతే మేం కాల్పులు జరిపామని చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా మూడేళ్ల కింద జాతీయ స్థాయిలో అండర్19 జట్టులో నయీం  ఆడాడని అతని స్నేహితుడు తెలిపాడు.