జ్యోతుల నెహ్రూ స్థానంలో కన్నబాబు..


వైసీపీ పార్టీ నుండి జ్యోతుల నెహ్రూ టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  అయితే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేవారు. ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరడంతో ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు జిల్లా బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. ఆయన పేరు మాత్రం ఖరారైందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ కమిటీల నేతలతో లోటస్ పాండ్ లో సమావేశమైన జగన్, ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి చివరకు కన్నబాబు పేరును ఖరారు చేశారని సమాచారం.