Andhra Pradesh Political News | Telangana Political News | Tollywood Latest News https://www.teluguwishesh.com Sat, 27 Apr 2024 23:57:40 +0530 Joomla! - Open Source Content Management en-gb Telugu Content https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98801-telugu-engineers-fly-to-us-in-search-of-work-depending-on-proxies.html https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98801-telugu-engineers-fly-to-us-in-search-of-work-depending-on-proxies.html

అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు చాలా మంది మనవాళ్లు అగ్రరాజ్యంలో స్థిరపడ్డారు. అయితే 20వ శతాబ్దం చివరి రెండు దశాబ్దాలలో అక్కడికి వెళ్లినవారి సంఖ్య అంతకుముందు కంటే గణనీయం. కానీ 21 శతాబ్దంలో అమెరికా ఉద్యోగం అన్నది సోషల్ స్టేటస్ గా మారింది. అదేంటీ మీ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయ్యిందిగా.. మరి ఇంకా ఇండియాలో ఏం చేస్తున్నాడు.. అనే స్థాయికి అగ్రరాజ్యం ఉద్యోగం మనవారిని తీసుకెళ్లింది.

ఇక టోఫెల్, జీఆర్ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడమే మనవారికి చాలా కష్టం. దీంతో పాటు అక్కడ యూనివర్సిటీలలో సీటు లభించడం, ఉత్తీర్ణత సాధించడం కూడా చాలా కష్టం. వేలాది డాలర్లు పీజులు కట్టడం కోసం మనవాళ్లు ఓ వైపు చదువుతూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబులు చేసేవారు. మన దేశ కరెన్సీలో లక్షల రూపాయలను భరించాలంటే అది అంత సులువుగా అయ్యే పనికాదు. అందుకనే తల్లిదండ్రులపై భారం పడకుండా వారు కష్టపడేవారు. ఇలా కష్టించినా సరే వారు చదువుల్లోనూ రాణించి చక్కని జాబ్ లో జాయిన్ అయిన తరువాత వాళ్ల కష్టానికి ఫలితం లభించేది.

అయితే ఇప్పుడు మారుతున్న కాలంలో అన్నింటికీ వేగాన్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్న యువత, వారి తల్లిదండ్రుల ధృకోణంలో మార్పులు సంభవించాయి. ఇప్పుడు అమెరికా అన్నది సోషల్ స్టేటస్ సింబల్ మాదిరిగా మారిపోయింది. తమ పిల్లలకు అగ్రరాజ్యంలో అడుగుపెట్టి ఏం చేస్తారు.? ఎలా ఉంటారు.? ఒంటరిగా జీవితాన్ని లాగడం ఎంత కష్టం అన్న విషయాలను మార్చి.. మారు మాట్లాడనీయకుండా అమెరికాకు వెళ్లాలంటే.. అలా చేయాలి.? ఇలా ఉండాలి.? అంటూ తల్లిదండ్రులే వారికి చిన్నప్పట్నించి అమెరికా అంటే.. అన్నదానిపై విశ్లేషణాత్మక వివరణను ఇచ్చేస్తున్నారు.

పిల్లలు చదువుల్లో రాణించకపోయినా.. ఇలా అయితే నువ్వు అమెరికా వెళ్లినట్టే అంటూ అనేస్తున్నారు.? ఎక్కడ తాను అమెరికాకు పోనో అని ఒత్తిడితో యావరేజ్ విద్యార్థులు కూడా కష్టపడి చదివేసి అగ్రరాజ్యంలోకి అడుగుపెడుతున్నారు. అయితే వీరితో పాటు ‘‘పైసా మే హై పరమాత్మ అన్న నానుడి పట్టుకు వేలాడే సూడో ప్రెస్టేజియస్ పీపుల్’’ కూడా ఉంటారు కదూ.. వారు తమ పిల్లలు కష్టపడటం చూడలేరు. అలా అని వారినో మాట కూడా అనరు. అలా అయితే కష్టం కదా.? అంటే దానికి డబ్బు సరిపోతుంది లేండి అని సమాధానం చెబుతారు. నిజానికి ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్యకు ఇప్పటి ఇంజనీరింగ్ విద్యకు.. జీఆర్ఈ, టోఫెల్ విద్యలకు వత్యాసం మాత్రం లేదని చెప్పలేం.

అదే చదువులు.. చదివేవారికి మాత్రం అంతకు మించిన జ్ఞానర్జనకు అటానమస్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు చక్కని వేదికలు. అప్పటి సిలబస్ లో అనేకానేక మార్పులు చోటుచేసుకుని అధునాతన విద్య అందుబాటులోకి రాగా, ఇది విద్యార్థులు కష్టపడేలా చేస్తోంది. ఇక దీనికి తోడు బడాయిలు, గప్పాలు, సినిమాటిక్ ప్రపంచాన్ని చూసే విద్యార్థులకు ఈ సిలబస్ చాలా తీవ్రమైన ఒత్తిడిని పెంచేస్తుంది. అసలు కాలేజీలకే వెళ్లని వారికి మాత్రం ఇది ముట్టుకుంటే చాలు కాటేసే కసాయి కాలనాగులా కనిపిస్తుంది. అయినా అందుబాటులోకి వచ్చిన అనేక నయా పంథాలను ఆశ్రయించి.. సెమిస్టర్ కో పర్యాయం కూడా పుస్తకం తెరువని విద్యార్థులైనా సరే చక్కని ఉత్తీర్ణత శాతంతో ఇంజనీరింగ్ కోర్సుల నుంచి పాస్ అవుట్ అవుతున్నారు.

అయితే అటానమస్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ విద్య.. సిలబస్ బేస్డ్ మాత్రమే కాకుండా తక్షణ ఉద్యోగంలో చేరేందుకు అసరమైన నైపుణ్యాలను అందిస్తోంది. దీంతో అటానమస్ కాలేజీలు, యూనివర్సిటీలలో చదివిన విద్యార్థులు ఉద్యోగంలో చేరిన వెంటనే అక్కడి ఒత్తడిని కూడా తట్టుకుని తమ ప్రావిణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే అదనుగా చేసుకుని డబ్బున్న మారాజులు కూడా దొడ్డిదారిన తమ వారిని చదివిస్తూ.. మనీ మ్యాటర్స్ అన్న సూక్తిని అడ్డుపెట్టుకుని తమ పిల్లలను ఉత్తీర్ణులను చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమి ధరలు ‘లక్ష్మీ’ అవతారం ఎత్తడంతో అక్కడివారు కూడా తమ పిల్లలు అగ్రరాజ్యంలో స్థిరపడేలా కార్యచరణను రచించి ప్రైవేటు యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలకు పరుగులు తీస్తున్నారు. ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా తమ పిల్లల భవిష్యత్ కోసం ఆరాటపడుతూ.. ఇంటర్ ఫలితాలు రావడంతోనే ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీలకు వెళ్లి సీట్లు రిజర్వు చేసుకునే పరిస్థితికి తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ విద్య దిగజారిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఎంసెంట్ రాసి మెరుగైన ర్యాంకు రాని విద్యార్థులు చివరి నిమిషంలో ఈ కాలేజీలలో సీటు కోసం పోటీ పడినా వారికది అందని ద్రాక్షగానే మారుతుంది.

రాష్ట్రంలోని కొన్ని పేరోందిన కాలేజీలలో ఎంసెంట్ ఫలితాలు వచ్చే నాటికి ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండటం లేదంటే పరిస్థితి ఎలా ఉంది.? ఎలా తయారైందో.? అమ్మకానికేనా మేనేజ్ మెంట్ కోటా సీట్లు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కోటాలో ఒక్కో స్ట్రీమ్ కు ఒక్కో ధరను నిర్ణయిస్తారు కాలేజీ యాజమాన్యాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్, సీఎస్ఈ ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ ఆకాశాన్ని అంటుతుది. ఈ స్ట్రీమ్ లలో సీటు కావాలంటే ఒక్కో సీటు ధర పాతిక లక్షలను దాటిపోతుండగా, కాసింత పేరున్న కాలేజీల్లో పది లక్షలను కూడా దాటేస్తుంది. ఇదీ ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యకు ఉన్న డిమాండ్.

ఇలా డబ్బులు పెట్టి కాలేజీల్లో సీటు సంపాదించిన తల్లిదండ్రుల ఆశలను వారి సంతానం ఎలా.? ఎంతవరకు సాకారం చేస్తారంటే.. అది ప్రశ్నార్థకమే. కేవలం ముఫై నుండి నలబై శాతం వరకు విద్యార్థులు అత్తెసరు మార్కులు తెచ్చుకుని మిడిమిడి జ్ఞానంతో బయటపడతారు. మరి మిగతావారు అంటే అక్కడ కూడా తమ ధన పరపతి ప్రదర్శించి ఉత్తర్ణులు అవుతారు కానీ, వారు సంపాదించిన జ్ఞాన విషయానికి వస్తే అసలేమీ ఉండదు. మరి ఇలాంటి వారు కూడా అమెరికా కలల్ని ఎలా సమకూర్చుకుంటున్నారు.? అగ్రరాజ్యం పేరు చెబితేనే వణుకు పట్టాల్సినవారు.. అడ్డదారుల్లో ఎగిరిపోతున్నారు. అదెలా సాధ్యం. అంటే..

నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యను కొన్నట్లుగానే.. 2-3 లక్షల వెచ్చించి వారి తరపున మరో నిఫుణులైన విద్యార్థుల చేత జీ.ఆర్.ఈ, టోఫెల్, డ్యూలింగో పరీక్షలు రాయించి అగ్రరాజ్యంలో అడుగుపెట్టేస్తున్నారు. వీరికంటే అధిక మార్కులు సంపాదించిన అనేకులు డబ్బులు పెట్టే పరిస్థితులు లేక ఇక్కడే ఏదో ఒక సంస్థల్లో చేరి కష్టపడుతుంటే.. లాస్ట్ బెంచీ విద్యార్థులు, ప్రెజెంట్ చెప్పి బయటకు వెళ్లే వాళ్లు మాత్రం ఏకంగా తమ కళ్లముందే ఎగిరిపోతుంటే ఇది ఎలా సాధ్యం అని నోరెళ్లపెట్టుకుని చూడటం తప్ప.. ఏమీ చేయలేని దిక్కుతోచనిస్థితి యావరేజ్, ఏబౌవ్ యావరేజ్ విద్యార్థులలో నెలకొంది.

తమ కన్నా చక్కగా చదువుకుని మార్కులను సాధించి అమెరికా వెళ్తున్న వారికి తమ హృదయలోతుల్లోంచి విదేశీయాన శుభాకాంక్షలు చెబుతున్న విద్యార్థులు.. తమ కంటే తక్కువ మార్కులు సాధించిన వారు అగ్రరాజ్యానికి వెళ్తుంటే మాత్రం.. ఔరా ఇదేలా సాధ్యమని ప్రశ్నించుకుంటున్నారు. మనతోనే ఆంగ్లం సరిగ్గా మాట్లాడలేనివాళ్లు అమెరికా వెళ్లి అక్కడి వారితో ఎలా మాట్లాడుతారు.? అసెంట్ తెలియకుండా ఎన్ని ఇబ్బందులు పడతారు అని నవ్వుకుంటున్నారు. కానీ దీనంతటికీ కారణం మాత్రం అనధికారిక కన్సెల్టన్సీలే. వాళ్ల పరీక్షలను బినామీల చేత రాయించి భారీ స్కోర్లు వచ్చేలా చేస్తున్నాయన్నమాట.

ఈ దొడ్డిదారిలో భారీ స్కోరుతో అమెరికా కాలేజీల్లో అడ్మీషన్లు సంపాదించుకోవడంలో చక్కగా చదువుకున్న విద్యార్థులతో పాటు పోటీపడటం గమనార్హం. అమెరికన్ యూనివర్సిటీలకు ధరఖాస్తు చేసుకుని అడ్మిషన్స్ పోందుతున్నారు. ఇక భారత్-అమెరికా దేశాల మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాలతో భారతీయులకు అధిక అవకాశాలను అమెరికా అందిస్తోంది. దీంతో తమ టాలెంట్ తో దేశం పరుపును నలుదిశలా చాటే నిబద్దత కలిగిన మెరిట్ విద్యార్థులతో పాటు బడాయి కోసం వెళ్తున్న డబ్బు బాబులు కూడా ఉన్నారు. దీంతో డబ్బున్న మారాజుల పిల్లలు అటు సామాన్య విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లను అందని ద్రాక్షలా మార్చడమే కాకుండా.. ఇటు అమెరికా వెళ్దామని ఆశలు పెట్టుకున్న మరికోందరు నిబద్దత కలిగిన విద్యార్థుల నుంచి అవకాశాన్ని కూడా లాగేసుకుంటున్నారన్నది కాదనలేని విషయం.

ప్రాక్సీ స్కోరులతో అగ్రరాజ్య యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థుల కష్టాలు అక్కడితో ముగిసిపోతాయ్ అనుకుంటే పోరబాటే. ఎందుకంటే పోట్ట చించినా అక్షర ముక్క తెలియని వారు అక్కడ కాలేజీల్లో చేరగానే వారు మాట్లాడే అంగ్లం, అసెంట్ అర్థం చేసుకోవడానికే అరు మాసాలకు పైగా పడుతుంది. అప్పటికీ పూర్తిగా వచ్చేస్తుందా అంటే అదీ లేదు.. అంతంతమాత్రమే. దీంతో కాలేజీల్లోని పాఠాలు అర్థం కాక, అక్కడి ఫ్రోఫెసర్లు చెప్పేదేంటో తెలియక నానా అవస్థలు పడతారు. ఫీజులు కట్టి కాలేజీల్లో చేరినంత ఈజీ కాదు అక్కడి ప్రోఫెసర్లు లెక్చర్లు అర్థం చేసుకోవడం. దీంతో తమ తల్లిదండ్రులు చూపిన మార్గానే గుడ్డిగా ఫాలో అవుతారు. అదే ప్రాక్సీ విధానం. తమ తరపున ప్రాజెక్టులు చేయడం, పరీక్షలు రాయడానికి ప్రాక్సీ విధానాన్ని ఆశ్రయించి ఇక్కడ బడాయిలు కోట్టిన వారు అక్కడ ప్రాక్సీలను మాత్రం బతిమాలుకుని.. ఏర్పాటు చేసుకుంటారు. కాగా తమ విద్యార్థుల తరపున ఎవరో బయటివారు పరీక్షలు రాస్తున్నారన్న విషయం తెలియకపోవడంతో తమ విద్యార్థులే పరీక్షలు రాస్తున్నారని అక్కడి యూనివర్సిటీలు సెర్టిఫికేట్స్ జారీ చేస్తున్నాయి.

అయితే ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చి యూనివర్సిటీలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే అగ్రరాజ్యంలోని వందల యూనివర్సిటీలలో ఇలా ప్రాక్సీలతో పరీక్షలు రాస్తున్నారన్న వివరాలు తెలియకో లేక అలాంటి సాంకేతికత అందుబాటులోకి రాకో మొత్తానికి వీరిపై నిఘాను ఏర్పాటు చేయలేకపోతున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇక మరో విషయం ఏమిటంటే అగ్రరాజ్యంలోని టాప్ కాలేజీలను మినహాయిస్తే అనేక యూనివర్సిటీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తమ కాలేజీల్లో అడ్మీషన్లు అడగడమే పాపం ఠక్కున ఇచ్చేస్తామని ఆయా కాలేజీలు తీరు వుంది. మరీ లక్షల రూపాయల పీజులు చెల్లించేందుకు ముందుకు వచ్చేవారు లేక.. వారు స్వయంగా రాసినా లేక ప్రాక్సీల చేత రాయించినా పెద్దగా పట్టించుకోకుండా తమ వద్దకు వచ్చిన విద్యార్థి పరీక్షా కాయితంలో సమాధానాలు సక్రమంగా ఉన్నాయా.? లేదా.? వాటికి ఎన్ని మార్కులను అవార్డ్ చేయవచ్చు అన్న కోణంలోనే పరిశీలిస్తున్నాయన్నది కూడా కాదనలేని వాస్తవం అని వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదంతా సరే కానీ, అమెరికాకు వెళ్లిన విద్యార్థులు అటు కాలేజీలకు హాజరుకాక.. పరీక్షలు రాయక ఇంతకీ ఏం చేస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. డబ్బు మరీ ఎక్కువగా ఉన్న మారాజుల పిల్లలు అమెరికాలో ఫ్రెండ్స్ తో కలసి వారాంతాలు ఎంజాయ్ చేయడం.. మిగతా రోజుల్లో ఏదో పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి వెళ్తున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం యూనివర్సిటీలలో నేర్పించే కోర్సులను నేర్చుకుంటూ.. వీకెండ్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అలా కాకుండా డబ్బున్న మారాజుతో కలసి వచ్చిన కొందరు మధ్య తరగతి విద్యార్థులు మాత్రం ఏదో ఒక పార్ట్ టైమ్ ఉద్యోగం చూసుకుని దానిని చేసుకుంటూ ఇంటికి వచ్చాక స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే వీరు చదివేది వీరికి ఎంతో కొంత వచ్చు అని చెప్పడానికి మాత్రమే కానీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు కాదు. మరీ పార్ట్ టైమ్ జాబ్ చేసిన డబ్బును తమ పరీక్షలు రాసే ప్రాక్సీలకు చెల్లించేందుకు వెచ్చిస్తారు. ఇలా మొత్తానికి ఆ కాలేజీల నుంచి పాస్ అవుట్ గా నిలుస్తారు.

ఇక కాలేజీల నుంచి బయటపడగానే వారికి అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. ఏదో ఒక మిత్రుడి సహకారంతోనో లేక ప్రాక్సీ కన్సల్టెన్సీల మద్దతుతోనో ఉద్యోగం తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడతారు. అప్పటి వరకు ఉన్న జోష్ మెల్లిమెల్లిగా సన్నగిల్లుతూ.. జీవితం, భవిష్యత్తు అన్న దానివైపు దృష్టి మళ్లుతుంది. తమ స్నేహితులందరికీ చక్కని సంస్థల్లో ఉద్యోగాలు రావడం.. వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి రెండు రోజులు సెలవులు లభించడంతో వీరిలో తెలియని అందోళన కూడా ప్రారంభమవుతుంది. ఎంతసేపు ఆడ్ జాబ్స్ చేయడం.. మంచి సంస్థలో ఏదో ఒక్క ఉద్యోగం వచ్చినా చాలు అంటూ చేసే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అందుకు మిత్రుల ద్వారా పని కాకపోతే మళ్లీ ప్రాక్సీ ఏజెన్సీల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తారు. ప్రాక్సీ ఏజెన్సీలు ఈ యువకులను ఆశలను సోమ్ముచేసుకుని వారికి ఏదో ఒక సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తాయి. హెచ్ ఆర్ మేనేజర్లను ఈ ఏజెన్సీలు మ్యానేజ్ చేస్తాయని అందుకు వారికి విలువైన కానుకలు కూడా ఇస్తాయని టాక్.

అయితే ఇలా ప్రాక్సీ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన ఉద్యోగాలలో చేరిన విద్యార్థులు.. వారు కష్టపడిన సొమ్ములో అర్థభాగానికి పైగానే ఆయా ఏజెన్సీలు చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి ఉద్యోగం ఇప్పిస్తే నెల నెలా వారికి మామూలు ఇవ్వాలా అంటే.. తప్పదు మరి. అయితే అది ప్రతి నెల ఇవ్వాల్సిన పనిలేదు. కానీ ఆయా ఉద్యోగాన్ని నిలుపుకునేందుకు తమకు రాని పనిని.. తాము నేర్చుకునేంత వరకు.. లేదా తాము స్వంతంగా పని చేయగలిగే వరకు ప్రాక్సీల సాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే సంస్థలకు కావాల్సిన అవుట్ పుట్ ఏ రోజుకా రోజు ఇవ్వక తప్పదు కదా. దీంతో సపోర్ట్ అదే ప్రాక్సీలకు చెల్లించక తప్పదు. అయితే ప్రాక్సీలు నేరుగా అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఏజెన్సీల ద్వారా తీసుకుంటాయి. ఎందకంటే వీరిద్దరినీ కలిపేది ఏజెన్సీలే. దీంతో అటు ఏజెన్సీల కమీషన్, ఇటు ప్రాక్సీలు ఫీజులు పోతే అభ్యర్థులకు నెల జీతంలో మిగిలేది నలభై శాతమే.

ఇక అమెరికాలోని బడా బడా సంస్థల్లో ఎంట్రీ లెవల్ జాబ్ లు చేసేవారిపై వర్క్ ప్రెజర్ అంతగా ఉండదు. కనుక ఒక్కో ప్రాక్సీలు సుమారుగా ముగ్గురు నుంచి నలుగురు ఉద్యోగస్థులకు ప్రాక్సీలుగా చేస్తుంటారు. ఇది వారికి పెద్ద కష్టమైన పనేం కాదు, అయితే వారిలో సంపాదించాలన్నా యావ మాత్రం ఉండాలి. అయితే ఆ విధంగా అడుగడుగునా ప్రాక్సీ అండతోనే సగం జీవితాన్ని వెల్లదీసిన యువకులు.. ఉద్యోగాల్లో స్థిరపడిన తరువాత మాత్రం క్రమక్రమంగా తమ భవిష్యత్తుపై ఆశలు చిగురించి.. కష్టపడటం.. అప్పటి దాకా ఒక లెక్క.. అప్పటి నుంచి మరో లెక్క అంటూ అప్పటి వరకు తాము చదువు కోవాల్సినదంతా ఆ ఆరు మాసాలు లేదా ఎనమిది నెలల్లో నేర్చుకుంటారు. ప్రతిభాపాటవాలతో క్రమక్రమంగా వటుడింతై అన్నట్లు ఉద్యోగాల్లో అనుభవంతో రాణించి పదోన్నతులు అందుకుంటారు. అయితే ఇలా మన దేశం నుంచి అనేకమంది వెళ్తుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉందని మాత్రం చెప్పక తప్పదు.

ఇలా ప్రాక్సీ బతుకులు బతుకుతున్న వారిలో మన తెలుగువాళ్లే చాలా ఎక్కువ అని ఇటీవల ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఎక్కువగా కనపించరు. ఇది సంతోషించదగిన పరిణమామే. తెలుగువాడంటే తెలుగువాడికే పడదు అని నిన్నమొన్నటి వరకు అనేవారు. నలుగురు కలసి వెళ్లే చోట, ఒకరి కాలు మరోకరు పట్టుకుని ఎవరినీ ముందుకు వెళ్లనీయరని అనేవాళ్లు.. కానీ తెలుగువారు పెద్ద సంఖ్యలో అమెరికాలో కనబడుతున్నారంటే.. తెలుగువాడికి తెలుగువాడే శత్రువన్న వాదన తప్పని స్పష్టంగా కనబడుతోంది. ఆ వాదనను కొట్టిపారేస్తుంది.

అమెరికాలో తెలుగువారి కన్సల్టెన్సీ పేరుతో ఇలాంటి ప్రాక్సీ వ్యాపారం చేస్తున్నారన్న వార్తలు వినబడుతున్నా.. తెలుగువారిని తమ తోటివారిని అగ్రరాజ్యానికి తీసుకెళ్తున్నారంటే అది సంతోషించదగ్గ పరిణామమే. అయితే అక్కడికి వెళ్లిన తెలుగువాళ్లు ఏదో ఏడాది ఎంజాయ్ చేస్తారు.. జీతాన్ని సమర్పించుకుంటారు కానీ.. ఆ తరువాత పని నేర్చుకుని వృద్దిలోకి రావడం అన్నది తప్పక జరుగుతుంది. ఇలా వృద్దిలోకి వచ్చాడా.. ఇక రాణించేస్తాడు. అయితే యూనివర్సిటీలలో చదువుకునేప్పుడు మాత్రం ఆడ్ జాబ్స్ చేసుకోవడం అన్నది అందరికీ కామన్. తమ తల్లిదండ్రులపై భారం కాకూడదనే వారు ఆడ్ జాబ్స్ చేసుకుంటారు.

ఈత కొలనులో ఈత నేర్చుకోమ్మని ఓ బిడ్డను తన తండ్రి రోజు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్లినా.. ఆ పిల్లాడు నేర్చుకోడు. అటు ఇటు తిరుగుతూ.. నడుముకు వడ్డానంలా ఓ ట్యూబ్ కట్టుకుని ఓ మూలన తక్కువ లోతుగా ఉన్న చోటే తిరుగుతుంటాడు. కానీ అదే పిల్లాడ్ని బావిలోనో, చెరువులోనే వదిలితే.. తప్పక ఈత నేర్చుకుంటాడు. ఈతకొడుతూ బయటకు వస్తాడు. ఇది కూడా అలాంటిదే. తల్లిదండ్రులు మేమున్నాం అన్న ధైర్యం చెబితే వాళ్లు ఉన్నారులే అన్న భరోసా కలిగే విద్యార్థులు జీవితాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అదే ఏకాంతంగా ఉంటే ప్రదేశంలో ఉంటే తాను బతకాలి.. నలుగురిలో ఒకరిలా.. అంటూ సాగే అతని ప్రయాణం.. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచేలా సాగుతుంది. విద్యార్థులు తమ జీవితాలను సీరియస్ గా తీసుకునే వరకు మాత్రమే ఈ ఎంజాయ్ మెంట్ అంటారు. ఒక్కసారి పని నేర్చుకుని అందులో నిమగ్నమయ్యారా.? ఇక తమ ఎంజాయ్ మెంట్ ను పనిలోనే వెతుక్కుంటారు. ఇది నిజం.

అమెరికాపై ఆశలతో ప్రాక్సీల చేతుల్లో పడి తమ జీవితాలను, జీతాలను సమర్పించుకున్న యువత.. అలాంటి ఆశలతో అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టే వారికి ఆదర్శంగా నిలుస్తూ తమ జీవిత ఘట్టాలను పంచుకుంటూ ఇలా చేయాలన్న వారిలో ఒక్కరు మారినా.. అది మిలియన్ డాలర్ల ఆనందాన్ని ఇస్తుంది. ఇక అమెరికాలాంటి దేశాల్లో ఉద్యోగమనే స్వప్నం సాకారం చేసుకోవాలని భావించే యువత.. అవకాశం ఉన్నప్పుడే సరైన దారిలో వెళ్లి విజయాలను అందుకోవాలని, అక్రమమైన మార్గంలో వెళ్లి భవిష్యత్తును బలి చేయవద్దు. ఇక అక్కడి ప్రభుత్వాలు మారుతూ ఏ క్షణంలో ఏలాంటి నిర్ణయం తీసుకుంటాయో కూడా తెలియని నేపథ్యంలో అమెరికా ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాల యువత వాటిని అందుకోవాలి.

]]>
aravind.d@vsil.com (Aravind) Taja Varthalu Tue, 22 Aug 2023 12:27:32 +0530
Telugu Content https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98800-om-raut-defends-saif-s-ravana-look-in-adipurush-%E2%80%98this-is-how-demons-look-today%E2%80%99.html https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98800-om-raut-defends-saif-s-ravana-look-in-adipurush-%E2%80%98this-is-how-demons-look-today%E2%80%99.html

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్ డిజాస్టర్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కాగా, రెబెల్ స్టార్ నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్' పైనే అభిమానులు అన్ని అశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్.. యానిమేషన్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో అభిమానులు హర్ట్ అయ్యారు.

ఫాన్స్ విషయాన్ని పక్కనబెడితే.. ఈ చిత్ర టీజర్ వీక్షించిన పలు వర్గాలు చిత్ర దర్శకుడు ఓం రౌత్ పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఈ టీజర్ చూసి చాలా మంది పెదవి విరువగా.. అనేకమంది చిత్రంలోని వేషాధారణను వ్యతిరేకించారు. హిందువుల ఆరాధ్యదేవుడు శ్రీరాముడి.. రామాయణ గాధను ఇతివృతంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో తమ భావాలను గాయపర్చేలా రూపోందించారని విమర్శలు మొదలయ్యాయి. మరీముఖ్యంగా రావణుడి గెటప్ ను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించారు.

ఆదిపురుష్ చిత్ర టీజర్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని.. చిన్ని వీడియోను చూసి ఒక అంచనాకు రావద్దని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల అవుతుందని... సినిమా చూసిన వారెవరూ నిరాశ చెందరని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని అన్నారు. ప్రభాస్ కోసమే రాముడి పాత్రను రాశానని... కథ రాస్తున్నంత సేపు తన మైండ్ లో ప్రభాసే ఉన్నాడని చెప్పారు. ప్రభాస్ కోసం ఈ సినిమాను తెరకెక్కించానని.. ప్రభాస్ నో చెప్పి ఉంటే సినిమా చేసే వాడిని కాదని అన్నారు. ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని చెప్పారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 19:51:27 +0530
Telugu Content https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98799-vennela-kishore-as-mysore-bujji-from-manchu-vishnus-ginna.html https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98799-vennela-kishore-as-mysore-bujji-from-manchu-vishnus-ginna.html

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు. రాజబాబు, రేలంగి, పద్మనాభం నుంచి అల్లు రామలింగయ్య, సుత్తి బద్రర్స్.. అక్కడి నుంచి ఏవీఎస్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వరకు అందరి నుంచి హాస్యాన్ని.. కాదు కాదు.. నవ్వించే తత్వాన్ని అందిపుచ్చుకుని ప్రస్తుతం సినీమాల్లో తనదైన ముద్రవేసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో వెన్నల కిషోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. సినీపరిశ్రమను ఏలిన ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, ఆహుతి ప్రసాద్ ఇలా కమేడియన్లు వరుసగా నవ్వుల్ని పంచి.. అవే జ్ఞాపకాలను మిగిల్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లగా.. అలాంటి సమయంలో నవ్వించే బాధ్యతలను తనపై వేసుకున్న వెన్నెల కిశోర్ ప్రేక్షకుల మనన్నలను పోందుతున్నాడు. తాజాగా ఆయన 'జిన్నా' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమాలో ఆయన 'మైసూర్ బజ్జీ' పాత్రలో కనిపించనున్నాడు.

వెన్నల కిషోర్ పాత్రను పరిచయం చేస్తూ .. ఆయన ఫస్టులుక్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆయన పాత్రలో కామెడీతో పాటు కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందనే విషయం ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. సొంత బ్యానర్ పై విష్ణు నిర్మించిన ఈ సినిమాకి, జి.నాగేశ్వరరెడ్డి కథను అందించగా .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చాడు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే జనంలోకి వెళ్లాయి.  పాయల్ - సన్నీలియోన్ అందాల సందడి చేసిన ఈ సినిమా, తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 18:51:57 +0530
Telugu Content https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98798-megastar-chiranjeevi-thanked-salman-khan,-fans-for-godfather-s-success.html https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98798-megastar-chiranjeevi-thanked-salman-khan,-fans-for-godfather-s-success.html

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్ రోల్ పోషించాడు. నిన్ననే సల్మాన్ ఖాన్ 'గాడ్ ఫాదర్' సక్సెస్ పట్ల చిరంజీవికి శుభకాంక్షలు తెలిపారు. "మైడియర్ చిరు గారూ ఐలవ్యూ" అంటూ ఓ వీడియో సందేశం పంపారు.

తాజాగా చిరంజీవి ఓ వీడియోతో సల్మాన్ ఖాన్ కు బదులిచ్చారు. "థాంక్యూ మైడియర్ సల్లూ భాయ్" అంటూ స్పందించారు. "మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, గాడ్ ఫాదర్ అద్భుత విజయం వెనుక 'మసూద్ భాయ్' ఒక శక్తిలా నిలిచాడు" అంటూ చిరంజీవి కొనియాడారు. "థాంక్యూ... లవ్యూ సోమచ్.. వందేమాతరమ్" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మోహ‌న్ రాజా మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.

చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌య‌న‌తార‌, ప్ర‌తినాయ‌క పాత్ర‌లో స‌త్య‌దేవ్ ఆక‌ట్టుకున్నారు. బాలీవుడ్ బ‌డా హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషించారు. దీంతో ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు హిందీలో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రేక్ష‌కుల స్పంద‌న నేప‌థ్యంలో హిందీలో గాడ్ ఫాద‌ర్ కి ఒక్కసారిగా 600  స్క్రీన్లు పెంచారు. ఈ విష‌యాన్ని చిరంజీవి వెల్ల‌డించారు. త‌న చిత్రానికి ఇంత మంచి విజ‌యం క‌ట్ట‌బెట్టిన ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ట్విట్ట‌ర్ లో  షేర్ చేశారు. 

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 17:52:11 +0530
Telugu Content https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98797-ponniyin-selvan-mani-ratnam%E2%80%99s-film-breaks-more-international-records%2C-nears-rs-350-crore-worldwide.html https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98797-ponniyin-selvan-mani-ratnam%E2%80%99s-film-breaks-more-international-records%2C-nears-rs-350-crore-worldwide.html

ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం 'పొన్నియిన్ సెల్వన్ 1' గత నెల 30న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. పలు అంతర్జాతీయ చిత్రాలు నెలకొల్పిన రికార్డులను బద్దలుకొడుతూ బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్లు సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన ఎనమిది రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.

ఇంతటి భారీ వసూళ్లు రాబట్టడం పలు అంతర్జాతీయ చిత్రాల ట్రాక్ రికార్డులు బద్దలయ్యాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 'పీఎస్‌1' తొలి వారంలో అద్భుత‌మైన బిజినెస్ చేసింది. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా తమిళ్‌, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుద‌లైన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విష‌యాన్ని ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ ధృవీకరించారు. ఈ వారాంతంలో రూ. 350 కోట్ల మార్క్ దాటుతుంద‌ని అంచ‌నా వేశారు.

'రోబో 2.0', 'కబాలి', 'బిగిల్', 'విక్రమ్' తర్వాత రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన ఆరో తమిళ సినిమా ఇదేనని త్రినాథ్ తెలిపారు. 'కబాలి', 'రోబో 2.0' ఓవ‌రాల్‌ బాక్సాఫీస్ కలెక్షన్లను అధిగమించిన ఈ చిత్రం 'విక్ర‌మ్' రికార్డును కూడా బ్రేక్ చేసే దిశ‌గా ముందుకెళ్తోంది. విదేశాల్లోనూ 'పీఎస్‌1' హ‌వా కొన‌సాగుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం 5 మిలియ‌న్ల క్ల‌బ్‌లో చేరింది. ర‌జ‌నీకాంత్ 'రోబో 2.0' చిత్రం త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో త‌మిళ మూవీగా నిలిచింది.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 16:52:44 +0530
Telugu Content https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98796-ori-devuda-trailer-venkatesh,-vishwak-sen-film-is-a-story-about-second-chances.html https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/98796-ori-devuda-trailer-venkatesh,-vishwak-sen-film-is-a-story-about-second-chances.html

తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో విష్వక్సేన్ ఆయా చిత్రాల ప్రమోషన్ వర్క్ కోసం కూడా తెగ కష్టపడతాడు. అలా గత చిత్ర ప్రమోషన్ వర్క్ లోనే ఆయన కాసింత కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విక్టరీ వెంకటేశ్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు.

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపోందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. దీపావళి కానుకగా ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం తరువాత కన్నడ భాషల్లో రీమేక్ గా తెరకక్కిన ఈ కథ శాండిల్ వుడ్ ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించే విధంగా చిత్రం రూపోందినట్లు.. అందునా విక్టరీ వెంకటేశ్ ఉన్నారని తెలియగానే మినిమమ్ గ్యారెంటీ వచ్చేసినట్టేనని తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓరి దేవుడా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే ఏకంగా 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టి, ట్రెండింగులో నెంబర్ వన్ గా నిలిచింది. జీవితంలో వరుస కష్టాలు ఎదురైనప్పుడు 'ఓరి దేవుడా' ఇవెక్కడి కష్టాలురా నాయనా అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక అవకాశాన్ని చేజారిన సందర్భంలో భగవంతుడు మరొక్క ఛాన్స్ ఇస్తే బాగుండునే అనుకోవడం జరుగుతుంది. ఈ రెండు అంశాల చుట్టూనే తిరిగే కథ ఇది. తెలుగులోను ఈ కథకి ఆదరణ లభిస్తుందేమో చూడాలి.

{youtube}v=x4-7tqS1h_Q|620|400|1{/youtube}

]]>
manohararao.g@vsil.com (Manohararao) Movie News Sat, 08 Oct 2022 15:51:47 +0530
Telugu Content https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98795-ola-electric-scooter-turns-saviour-as-lights-go-out-during-navratri-celebrations.html https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98795-ola-electric-scooter-turns-saviour-as-lights-go-out-during-navratri-celebrations.html

అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది. ఎలా అందరిలోనూ నిరుత్సాహం. ఇంతలో ఒకరికి మంచి ఐడియా వచ్చింది. ఇటీవలే కొన్న తన కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అక్కడికి తెచ్చేశారు. ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసి స్కూటర్ లోని స్పీకర్ లకు కనెక్ట్ చేసి పాటలు పెట్టారు. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో బ్యాటరీ చార్జింగ్ అయి ఉంది. ఇంకేం స్కూటర్ లో-లైట్ ను ఆన్ చేసి వెలుతురు పెట్టుకున్నారు. స్పీకర్లలో పాటలు పెట్టుకున్నారు. ఆడా మగా అంతా కలిసి వలయంలా ఏర్పడి తిరుగుతూ గర్భానృత్యం చేశారు. అయితే పవర్ కట్ తో పూర్తి చీకటిగా మారింది. దీంతో.. ఆ వీడియో కాస్త మసకగా వచ్చింది. శ్రేయాస్‌ సర్దేశాయ్‌ పేరిట ఉన్న ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేయగా వైరల్‌ అయింది. 47 వేలకుపైగా వ్యూస్‌ రాగా.. వందలకొద్దీ లైకులు కూడా వచ్చాయి. ‘‘నవరాత్రి ఉత్సవాల సమయంలో కరెంటు పోతే ఓలా ఎస్‌1 ప్రో ఆదుకుంది. ఓలా స్కూటర్‌ లోని స్పీకర్లు అవసరానికి బాగా పనికొచ్చాయి..’’ అని క్యాప్షన్‌ పెట్టారు.

‘ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను ఇలా కూడా వాడొచ్చని మాకు తెలియదు’, ‘ఈ ఐడియా ఏదో చాలా బాగుంది..’ అని కొందరు అంటుంటే.. ‘నవరాత్రి ఉత్సవాలకు ఏది అడ్డు వచ్చినా ఆగేదే లేదు. వేడుకలపై వెనక్కి తగ్గేదే లేదు..’ అని అని మరికొందరు పేర్కొంటున్నారు. ‘‘సమస్య ఏదైనా, ఎలాంటిదైనా సరే.. దానికి కచ్చితంగా ఓ పరిష్కారం ఉంటుంది. ఇక్కడ వీళ్లు దాన్ని సరిగ్గా గుర్తించి పాటించారు.’’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘‘ఓలా అంటే ప్రయాణం మాత్రమే కాదు. ఎంటర్‌టైన్మెంట్‌. అవసరమైనప్పుడు ఆదుకునే లైఫ్‌ సేవర్‌ కూడా..’’ అని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Sat, 08 Oct 2022 13:45:03 +0530
Telugu Content https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98794-tirumala-crowds-of-devotees-have-risen-to-tirumala.html https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98794-tirumala-crowds-of-devotees-have-risen-to-tirumala.html

తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా.

దసరా సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇక అత్యంత పవిత్రమైన పెరటాశి మాసంలోని మూడవ శనివారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తమిళ భక్తులకు అనవాయితీగా వస్తోంది. దీంతో గురు, శుక్రవారాల్లోనే తమిళనాడుకు చెందిన భక్తజన సందోహం అత్యంత భారీ సంఖ్యలో తిరుమల కోండకు చేరుకుని శనివారం రోజున స్వామివారి దర్శనానికి వేచిచూసింది. కాగా కరోనా కారణంగా గడిచిన రెండేళ్లు తిరుమలకు పెద్ద సంఖ్యలో రానీ భక్తులు ఈ సారి మాత్రం మలయప్ప స్వామి దర్శనానికి పోటేత్తారు.

ఈ నేపథ్యంలో దాదాపుగా భక్తుల క్యూలైను గోగర్భం డ్యామ్ వరకు చేరుకోవడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం వరకు క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. ఈ సాయంత్రం క్యూలైన్ల వద్దకు వచ్చిన భక్తులను అధికారులు తిప్పి పంపారు. వారు రేపు ఉదయం 6 గంటలకు రావాలని సూచించారు. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించిన ఆయన, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని, అందుకే రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Sat, 08 Oct 2022 12:48:41 +0530
Telugu Content https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98793-government-makes-it-easier-to-get-bh-series-number-plates.html https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98793-government-makes-it-easier-to-get-bh-series-number-plates.html

దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్ పేరుతో, ఆంధప్రదేశ్ అయితే ఏపీ పేరుతో, తమిళనాడులో టీఎన్ పేరుతో వాహన నంబర్ ప్లేట్లపై సిరీస్ మొదలవుతుంది. వీటి మాదిరే బీహెచ్ విధానం కూడా పనిచేస్తుంది. వివిధ రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలు బీహెచ్ సిరీస్ కు మారిపోయే అవకాశం కూడా రానుంది. నిబంధనలకు సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివిధ రాష్ట్రాల పరిధిలో ఉద్యోగరీత్యా బదిలీ అయిన సందర్భాల్లో వాహనాల రిజిస్ట్రేషన్ ను కూడా మార్చుకోవడం ప్రస్తుతానికి తప్పనిసరి. వీరిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర సర్కారు బీహెచ్ ను తీసుకొచ్చింది. బీహెచ్ కింద రిజిస్టర్ అయిన వాహనాలు దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి అక్కడ తిరుగుతున్నా, రిజిస్ట్రషన్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలు నిర్ధేశిత పన్ను చెల్లించడం ద్వారా బీహెచ్ కు మారిపోవచ్చు. ఇకపై బీహెచ్ పరిధిలో వాహన రిజిస్ట్రేషన్ బదిలీలు (విక్రయించినప్పుడు) సులభంగా కానున్నాయి.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Sat, 08 Oct 2022 11:46:10 +0530
Telugu Content https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98792-garikipati-issue-fans-should-not-spoil-chiru%E2%80%99s-magnanimity.html https://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/98792-garikipati-issue-fans-should-not-spoil-chiru%E2%80%99s-magnanimity.html

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు కావడంతో మెగా అభిమానులు అగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే అవధాని, పండితుడు అయిన గరికపాటి నరసింహారావుపై మెగా అభిమానులు ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరాదని తాజాగా నాగబాబు వివరణ ఇచ్చారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో చోటుచేసుకున్న సంఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

తాజాగా ఇవాళ వివరణ ఇస్తూ నాగబాబు మరో ట్వీట్ చేశారు. గరికపాటి లాంటి పండిత ఉద్దండుడు తమకు క్షమాపణలు చెప్పాలని తాము కోరుకోవడం లేదని.. అయితే పరిస్థితులను అర్థం చేసుకోవాలని మాత్రమే అన్నామని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన రాస్తూ..  'గరికపాటి వారు ఏదో మూడ్‌లో ఆలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్.' అంటూ పోస్ట్ చేశారు.

జరిగిందిదే: దసరా సందర్భంగా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ వేడుకలో జరిగిన ఆసక్తికర సన్నివేశం మెగా ఫ్యాన్స్ కు గరికపాటికి మధ్య పోరపచ్చాలను పోడచూపింది. సరిగ్గా పండితులు గరికపాటి నరసింహారావు సమ్మెళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న తరుణంలో అప్పటికే వేదికను అలంకరించిన మెగాస్టార్ చిరంజీవిని చూసిన అభిమానులు ఆయనతో ఫోటో సెషన్‌ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. లేదంటే తాను వెళ్లిపోతానని నిరసన తెలపడంతో.. చిరంజీవి వెంటనే వచ్చి గరికపాటికి నమస్కరించి పక్కన కూర్చున్నారు.

]]>
manohararao.g@vsil.com (Manohararao) Taja Varthalu Fri, 07 Oct 2022 19:34:41 +0530