సెప్టెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్ లో తాము తలపెట్టిన సమైక్య సభకు అందరికీ అనుమతివ్వాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేయనున్నట్లు ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సభలో పాల్గొనేందుకు కేవలం ఉద్యోగులకే అనుమతి ఇస్తామని పోలీసు ఉన్నతాధికారులు తమకు తెలిపారని చెప్పారు. అయితే సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో ఒక్క ఉద్యోగులే పాల్గొనలేదని విద్యార్థులు, వివిధ తరగతులకు చెందిన ప్రజలందరూ పాల్గొంటున్నారు కావున వారందరికీ ఈ సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ విజ్ఞప్తిని పోలీసులు అధికారులు అంగీకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. సభకు పాల్గొనే వారందరికీ టోకెన్స్ ఇస్తామని ఆయన చెప్పారు. విభజన వల్ల నష్టాలు, సమైక్యంగా ఉంటే లాభాలేంటనే విషయాలను ఈ సభలో వివరిస్తామని ఆయన పేర్కొన్నారు.ఎవరైనా ఎక్కడైనా యాత్రలు చేసుకునే హక్కు ఉందని, వారిని అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని అన్నారు. చంద్రబాబు, షర్మిల యాత్రలతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు.
పాటించాలి : జానారెడ్డి
ఈ నెల 7న సీమాంధ్ర ఉద్యోగుల జెఎసి సమైక్య సభను, తెలంగాణ జెఎసి శాంతి ర్యాలీ జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలు సంయమనం పాటించాలని మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై నేతలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. సమైక్యాంధ్రకై సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు, ప్రజలు 35 రోజులుగా ఉద్యమించడం దురదృష్టకరమన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more