కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి, ఆజాద్ , సిఎం కిరణ్ పాల్గొన్నారు. అయితే ఆళ్లగడ్డలో చిరంజీవి తన వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీటుగా చిరంజీవి సమాధానం చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. వైఎస్ఆర్సీపీకి ఓటువేస్తే అవినీతికి పట్టం కట్టినట్లేనని చిరంజీవి అన్నారు. వైఎస్ కుటుంబం వల్ల నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని చిరంజీవి విమర్శించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్ల సంపాదించారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను జగన్ కొల్లగొట్టారని చిరంజీవి చెప్పారు.
అంతేకాకుండా 2009లో శోభా నాగి రెడ్డిని మహిళ కదా అని నమ్మి టిక్కెట్ ఇస్తే ఆమె తనతో పాటు ఈ నియోజకవర్గం ప్రజలను మోసం చేశారన్నారు. ఆమెకు ఈ ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా .. ఆళ్లగడ్డ .. వాళ్లగడ్డకాదు.. మాగడ్డఅని చిరు తనదైన స్టైలో డైలాగ్ చెప్పటంతో.. ప్రజలు ఒక్కసారి పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండ చిరు చెప్పి డైలాగ్ కు .. ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం షాక్ తిన్నట్లు తెలుస్తుంది. చివరకు ప్రజల ఉత్సహం చూసి ఆజాద్ , కిరణ్ లు కూడా నవ్వుకున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారంలో.. గతంలో కంటే ఇప్పుడు రెచ్చిపోయి తనదైన స్టైల్ ప్రజలకు చూపిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వైఎస్ఆర్ పార్టీపై చిరు నిప్పులు కురిపించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. మనిషి ప్రాణానికి విలువ తెలియని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదవాని గొంతుకు ఈ నియోజకవర్గంలో ఇన్నాళ్లు విలువ లేదని, ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే శాంతియుతంగా ఉంటుందన్నారు. ఓటు అనే బ్రహ్మాస్త్రం ద్వారా కసాయి వాళ్లకు బుద్ధి చెప్పండని సూచించారు. సాక్షి పేపర్లో అన్నీ అబద్దాలే వస్తాయన్నారు. వైయస్ జగన్ను సిబిఐ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంటే అరెస్టు చేయలేదని, లక్షల కోట్లు దోచుకున్నందుకు అరెస్టు చేసిందని మండిపడ్డారు.
పరిటాల రవీంద్ర హత్య కేసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి... జగన్ పైన సిబిఐ విచారణ జరిపించారని అప్పుడు ఎందుకు కాంగ్రెసు కక్ష కట్టిందని అడగలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసును, పిల్లనిచ్చిన మామ స్వర్గీయ నందమూరి తారక రామారావును మోసం చేశారని, జగన్ కూడా కాంగ్రెసును మోసం చేశారన్నారు. వైయస్ బతికి ఉంటే కాంగ్రెసు పార్టీలోనే ఉండేవారని, ముఖ్యమంత్రిగా ఉండేవారన్నారు. ఆయన కంపెనీల్లోకి అక్రమ సొమ్ము రాకపోతే నిరూపించుకోవాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more