కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన సొంత బ్యానర్ లో నిర్మించి నటిస్తోన్న తాజా చిత్రం చక్ర విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఓటిటీ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిన తరుణంలో చిత్ర విడుదలను నిలిపివేయాలని తాజాగా మద్రాసు హైకోర్టు అదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఏకంగా ఈ చిత్రానికి నిర్మాత, నటుడైన హీరో విశాల్ తో పాటుగా దర్శకుడు ఆనందన్ కు కూడా నోటీసులను జారీ చేసింది. హీరో విశాల్ అంతకుముందు నటించిన ‘యాక్షన్’ చిత్రానికి నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ట్రైడెంట్ ఆర్ట్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు ఈ మేరకు తాజా అదేశాలను జారీ చేసింది.
ఆయనతో పాటు ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్ ఆనందన్ కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. హీరో విశాల్ కు మంచి బ్రేక్ ఇస్తుందని భావించిన ‘చక్ర’ చిత్రానికి ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బ తగిలింది. దీంతో కనీసం ఓటిటి ద్వారా విడుదలను ఆపాలంటూ నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ హైకోర్టులో కేసు వేసింది. కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు విశాల్కు, డైరెక్టర్ ఆనందన్కు నోటీసులను జారీ చేసింది. అసలు హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘చక్ర’ విడుదలకు అంతకుముందు విడుదలైన ‘యాక్షన్’ చిత్రానికి మధ్య సంబంధమేంటీ.? ఆ నిర్మాత ఈ చిత్రాన్ని ఎందుకు అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
అసలు విషయం ఏంట్రీ ఇస్తే.. విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన ‘యాక్షన్’ చిత్రాన్ని ఏకంగా రూ.44 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా విడుదల సమయంలో రూ.20 కోట్ల వరకు హీరో విశాల్ గ్యారెంటర్ ఉండేలా అగ్రిమెంట్స్ రాసిచ్చాడని అయితే సినిమా హిట్ కాకపోగా భారీ నష్టాలను మిగిల్చింది. ఈ నష్టాలను భరించడానికి విశాల్ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్ దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ లోనే చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఇప్పుడు ఆ మాటను తప్పిన హీరో తన సోంత బ్యానర్ లోనే సినిమాను విడుదల చేస్తున్నారని. ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగే వరకు చక్రను అపాలని పిటీషన్ దాఖలు చేయడంతో హైకోర్టు హీరో విశాల్, డైరెక్టర్ ఆనందన్ కు నోటీసులు పంపింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more