Veteran Tamil actor, director Visu passes away ప్రముఖ దర్శకుడు, నటుడు విసు కన్నుమూత..

Noted tamil screen writer director and actor visu passes away

Noted Tamil screen writer no more, noted tamil director dies, veteran tamil actor passes away, tamil actor Visu passes away, kollywood actor Visu passes away. kollywood screen writer, kollywood actor Visu passes away, kollywood director Visu passes away. Tollywood, Entertainment, Movies

Noted Tamil screen writer, director and actor Visu, who was battling kideney related ailment, died on Sunday here, his family said. The 74-year old, noted for his witty dialogues in movies, including 1981 blockbuster and Rajinikanth starrer ‘Thillu Mullu,’ is survived by wife and three daughters.

కాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు, నటుడు విసు కన్నుమూత..

Posted: 03/23/2020 03:45 PM IST
Noted tamil screen writer director and actor visu passes away

తమిళ చిత్ర పరిశ్రమ శోకసంధ్రంలో మునిగింది. భారత్ దేశం జనతా కర్ప్యూ పాటించిన రోజునే కాలీవుడ్ లో విషాధం సంభవించింది. ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత, ప్ర్కీన్ ప్లే రచయిత విసు(74) అనారోగ్యంతో క‌న్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న మూత్ర పిండాల వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. 1945లో జ‌న్మించిన విసు 1981లో ప్ర‌ముఖ దివంగ‌త ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కుడిగా చేరారు. ‘తిల్లు ముల్లు’ చిత్రంతో ర‌చ‌యిత‌గా మారారు. ‘క‌ణ్మ‌ణి పూంగా’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు.

రంగస్థల నటుడిగా తన జీవన పయనాన్ని ప్రారంభించిన ఆయన అంతకుముందు టెలివిజన్ వ్యాఖ్యాతగానూ తమిళ ప్రజల్లో తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాలు తెలుగులోనూ అనువాద‌మై మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. తెలుగులో ఈయ‌న కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘ఆడ‌దే ఆధారం’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్పీ ముత్తరామన్‌ దర్వకత్వం వహించిన ‘కుడుంబం ఒరు కడంబం’ అనే సినిమాతో నటుడిగానూ మారారు.

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌ వంటి హీరోలతో కలిసి పనిచేశారాయన. ‘అరుణాచలం’ సినిమాలో రంభ తండ్రిగా చేసిన రంగాచారి పాత్ర ఆయనకు మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది. కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరనే పేరు పొందారాయన. విసు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సంసారం అదు నిన్‌సారం’కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సంసారం ఒక చదరంగం’ పేరుతో రీమేక్‌ చేశారు.

తమిళంలో విసు చేసిన పాత్రనే తెలుగులో గొల్లపూడి మారుతీరావు ప్రదర్శించగా, వారికి ఆయా పాత్రలు తమ కెరీర్ లో మరో మంచి గర్తింపును తీసుకువచ్చాయి. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘వరావు నల్ల ఉరావు’ చిత్రానికి ఉత్తమ రచయితగా తమిళనాడు స్టేట్ అవార్డు, ‘నీంగా నల్ల ఇరుక్కానుమ్’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు. విసు మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Visu  Actor  Screen Wtiter  Kidney failur  Aadadae aadharam  passes away  Tollywood  Kollywood  

Other Articles