మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. చిరంజీవి నటశిఖరమని చలనచిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు, దర్శకులు కొనియాడుతున్నారు. మెగాస్టార్ నటవిశ్వరూపాన్ని ఈ చిత్రంలో ప్రదర్శించారని సినీ వర్గాల టాక్. అయితే టాక్ విషయాన్ని పక్కనబెడితే తొలిరోజు ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబట్టిందన్న విషయమై ఎక్కువగా ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.
చిరంజీవి 151వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం తొలిరోజు వసూళ్లలో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 38.76 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇవి రికార్డుస్థాయి వసూళ్లేనని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సైరా నరసింహారెడ్డి బాక్సాఫీసులను షేక్ చేసింది. భారతీయ చిత్రాలలో అత్యధిక తొలిరోజు కలెక్షన్లను రాబట్టిన ఐదవ చిత్రంగా కూడా రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో 53 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ చిత్రం కర్ణటాకలో రూ.11 కోట్లు, తమిళనాడులో రూ.2కోట్లు, రెస్ట్ ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్ లో 13 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి మొత్తంగా 82 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇక బాహుబలి 2 (214 కోట్లు), సాహో (127 కోట్లు) రోబో 2.0 (94 కోట్లు), కబాలి (88 కోట్లు) వసూళ్లు చేయగా, ఆ తరువాతి స్థానంలో సైరా (82 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచింది.
చిరంజీవి కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం కావడం.. దర్శకుడిగా తనకి వచ్చిన అవకాశాన్ని సురేందర్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకోవడం .. భారీ తారాగణం ఈ కథలో భాగస్వాములు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అన్ని రకాల ప్రత్యేకతల కలగలసి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని దీంతో వసూళ్లలోనూ దూసుకుపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపోందిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు వెంకన్న పాత్రలో మెరిసాడు. ఇక నరసింహారెడ్డి బార్య పాత్రలో నయనతార నటించింది. వీరితో పాటు తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నిహారిక, రాధాకిషన్ తదితరులు నటించారు.
Do Read
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more