అఖిల్ తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. దాంతో అభిమానులంతా ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. అఖిల్ కూడా ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అందువల్లనే కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫలానా దర్శకుడితో ఆయన తదుపరి సినిమా వుండనుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.
తాజాగా ఇప్పుడు 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. 'గీత గోవిందం' చూసిన తరువాత, ఆ కథను పరశురామ్ హ్యాండిల్ చేసిన తీరు నాగార్జునకి బాగా నచ్చిందట. దాంతో ఆయనతో అఖిల్ సినిమా వుంటే బాగుంటుందని భావించినట్టు సమాచారం. ఈ కారణంగానే అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నట్టుగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more