టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్న చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రూపొందిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య' నా ఇల్లు ఇండియా. ఈ సినిమా మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుండగా, ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది. విశాల్ - శేఖర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విశాల్ శేఖర్ స్వరపరిచిన రెండు పాటలను ఇప్పటికే వదలగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ' బ్యూటీ ఫుల్ లవ్' అనే పాటని రిలీజ్ చేశారు.
'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో .. నాతో ఏదో అన్నావా.. " అంటూ ఈ పాట కొనసాగుతోంది. చక్కని లవ్ ఫీల్ తో అలా అలా సాగే ఈ పాట దృశ్యం పరంగా చూస్తే నిజంగానే బ్యూటీఫుల్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు. సిరివెన్నెల సాహిత్యం .. విశాల్ శేఖర్ సంగీతం అనుభూతి ప్రధానంగా .. ఆహ్లాదకరంగా కొనసాగుతూ హాయిని కలిగిస్తున్నాయి. ఈ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more