chittibabu's Rangamatta re-enters into social media చిట్టిబాబు రంగమ్మత్త సోషల్ మీడియాలోకి రీ-ఎంట్రీ

Suma s funny counter to anasuya rangamatta re enters into social media

rangasthalam, rangasthalam theatrical trailer, rangasthalam rangamatha, anasuya, host anchor suma, suma funny counter to anasuya, anasuya re-entry social media, anasuya social media re-entry, ramcharan, samantha, aadhi, dsp, sukumar

Ramgamatha gives re entry into social media with rangasthalam trailer, today after Suma who hosted the event yesterday, gives a funny counter to hot anchor Anasuya to tell that she looks younger than rangamatha.

చిట్టిబాబు రంగమ్మత్త సోషల్ మీడియాలోకి రీ-ఎంట్రీ

Posted: 03/19/2018 02:58 PM IST
Suma s funny counter to anasuya rangamatta re enters into social media

జబర్దస్త్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులలో తనదైన గుర్తింపును తెచ్చుకున్న అనసూయ ఇటు సినీ నటిగా కూడా అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా వుంది. అలాంటి ఓ హాట్ యాంకర్ కు.. మరో యాంకర్ తోడైతే.. అందులోనూ సభలోనే అశువుగా కౌంటర్లు వేసే వారైతేనూ.. ఆ కాంభినేషన్ ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తుంది. అలాంటి కాంబినేషన్ నిన్న విశాఖలో చోటుచేసుకుంది. తన అభిమానహీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో నటించేందుకు సిద్దమైనా.. అతనికి అత్త పాత్ర చేయడంలో కొంత సంశయానికి గురైనా ఎట్టకేలకు తన పాత్రను పూర్తి చేశానని అనసూయ నిన్నటి కార్యక్రమంలో చెప్పుకోచ్చింది.

అయితే అశువుగా కధల అల్లే టాలెంట్ వున్న మరో యాంకర్ సుమ.. అక్కడికక్కేడే అనసూయకు కౌంటర్ ఇచ్చింది. తనను కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు అక్కగా తీసుకోవాలని ముందుగా అనుకున్నారని, కానీ తనలాంటి నటిని తీసుకుంటే చెల్లిగా తీసుకోవాలి కానీ, అక్కగా తీసుకుంటే బాగుండదని తీసుకోలేదని సుమ చమత్కరించింది. అనంతరం అనసూయకి శుభాకాంక్షలు చెబుతూ 'రంగమ్మత్త' అంటూ ఆటపట్టించింది. దీంతో అనసూయ 'నేను మా చిట్టిబాబుకి మాత్రమే రంగమ్మత్తని' అని చెప్పింది. అంతేకాదు ఈ కౌంటర్ తో అనసూయ కన్నా తాను చాలా యంగ్ అని కూడా సుమ చెప్పేసుకుంది.

ఇక ఫిబ్రవరి అరవ తేదీన సామాజిక మాద్యమాలతో తనకున్న బంధాలను తెంచేసుకున్న నటి, యాంకర్ అనసూయ ఇవాళ మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఓ చిన్నారి తన ఫోటో తీస్తుంటే.. సెల్ ఫోన్ లాక్కుని పగలగొట్టి, దుర్భాషలాడిందంటూ ఓ మహిళ గతంలో అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనతో అమెపై నెటజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు చిన్నారి పిల్లలంటే ఇష్టమని తాను అలాంటి పనులకు పూనుకోను అని చెప్పినా నెట్ జనులు అమెను ట్రాల్ చేశారు.

దీంతో నెటిజెన్ల వ్యవహారశైలిపై విరుచుకుపడిన అమె.. తాను ఇక సోషల్ మీడియాకు దూరంగా వుంటానని చెప్పి ఫిబ్రవరి 6న తన అకౌంట్లను డిజేబుల్ చేసింది. తాజాగా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఫేస్ బుక్ అకౌంట్ ను నిన్న యాక్టివేట్ చేసి, 'రంగస్థలం' ట్రైలర్ ను అప్ లోడ్ చేసిన అనసూయ.. ట్విట్టర్ అకౌంట్ సోమవారం యాక్టివేట్ చేసింది. 'రంగస్థలం'లో తాను పోషించిన రంగమ్మత్త ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో మళ్లీ అనసూయకు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే వున్నారు. మరి హాట్ యాంకరా.. మజాకా.?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles