Sridevi Ashes immersed in Rameswaram | రామేశ్వరం వద్ద శ్రీదేవి అస్తికలు ఖననం.. విలపించిన బోనీ, కూతుళ్లు

Sridevi ashes immersed

Actress Sridevi, Sridevi Ashes, Rameswaram, Janhvi Kapoor, Khushi Kapoor, Boney Kapoor Sridevi Ashes, Sridevi Family Members Rameswaram

Actress Sridevi’s ashes immersed by Family Members at Rameswaram. Sridevi's untimely demise at a hotel room in Dubai came as a shock to the entire nation. Boney, Janhvi and Khushi Kapoor immersed the ashes of the 54-year-old actor in Rameswaram on Sunday.

శ్రీదేవి అస్తికలు రామేశ్వరంలో నిమజ్జనం

Posted: 03/05/2018 10:06 AM IST
Sridevi ashes immersed

ఆత్మీయులను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచి నటి శ్రీదేవి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆమె అస్తికలను కుటుంబసభ్యులు నిమజ్జనం చేసేశారు. తమిళనాడులోని రామేశ్వరం వద్ద సముద్రంలో ఈ తంతును పూర్తి చేశారు. తమిళనాడుకు చెందిన ఆమె అస్తికలను.. దక్షిణాది హిందూ సంప్రదాయం ప్రకారం బంగాళాఖాతంలో కలిపారు.

ఈ కార్యక్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలు తమ తల్లిని తలుచుకుని విలపించారు. తమ ‘జాన్’ ను కోల్పోయిన బోనీ కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. గతనెల 24న దుబాయిలో ఓ వివాహానికి వెళ్లిన శ్రీదేవి.. తర్వాత ప్రమాదవశాత్తుగా బాత్ టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురిచేసింది. కాగా, శ్రీదేవి మరణంపై తొలుత పలు అనుమానాలు వచ్చినప్పటికీ, దుబాయి పోలీసులు ఆమె ప్రమాదవశాత్తే మరణించారని ప్రకటించడంతో అవన్నీ పటాపంచలయ్యాయి.

ఆమె మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రముఖ నిర్మాత, వ్యాపార-రాజకీయ వేత్త సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సంస్మరణ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles