టాలీవుడ్ స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న ఆయనకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయంలో విచారణ కోసం ఆయన హాజరయ్యాడు. ఏపీ 09 బీటీ 6363 వాహనంలో ఆయనతోపాటు తనయుడు ఆకాశ్, సోదరుడు సాయిరాం కూడా వచ్చారు. అంతకు ముందు తన లాయర్ దగ్గరికి వెళ్లిన పూరీ, అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వచ్చాడు.
కాగా, విచారణకు అన్ని ఏర్పాట్లూ చేసిన సిట్ అధికారులు, పూరీ కోసం వంద ప్రశ్నలు రెడీ చేసినట్లు చెప్పుకుంటున్నారు. డ్రగ్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? కొకైన్ కోసం ఎవరిని ఆశ్రయించారు? కెల్విన్ ఎలా పరిచయం? అతని దగ్గరకు స్వయంగా వెళ్లారా? కెల్విన్ ఎవరి ద్వారా మీకందించేవాడు? రోజూ ఎంత మోతాదులో మీరు డ్రగ్స్ తీసుకుంటారు? మాదకద్రవ్యాల కోసం నెలకు మీరు చేసే ఖర్చు ఎంత? కెల్విన్ కన్నా ముందు డ్రగ్స్ అందించిన వారు ఎవరు? నైజీరియన్ వాసి జీఫాన్ తో మీకున్న సంబంధాలు ఎటువంటివి? మీరు డబ్బులు తీసుకుని వేరేవాళ్లకు డ్రగ్స్ ఇస్తున్నారా? ఫ్రెండ్లీగా ఇస్తున్నారా? లాంటి ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు ఆయన ఇచ్చే జవాబులను బట్టి అనుబంధ ప్రశ్నలు ఉంటాయని, సమాధానాలన్నింటినీ రికార్డు చేస్తామని అధికారులు తెలిపారు.
ఇక స్నేహితులు ముమైత్ ఖాన్, సుబ్బరాజు, చార్మీలకు మీ నుంచే డ్రగ్స్ వెళుతున్న విషయం నిజం కాదా? ఇంకా ఎవరెవరికి మీరు డ్రగ్స్ అందించారు? డ్రగ్స్ తో వచ్చే ఆ కిక్ ఎలా వుంటుంది? మా దగ్గరున్న సాక్ష్యాలకు మీ సమాధానం ఏంటి? ఎన్ని రోజులుగా డ్రగ్స్ వాడుతున్నారు? కొకైన్ వాడుతున్న విషయం నిజం కాదా? తప్పని తెలియదా? వంటి ప్రశ్నలను కూడా ఆయన ఎదుర్కోనున్నాడు. విచారణ ఈ ఉదయం 10.30 గంటలకు మొదలు అవుతుండగా, బయటికి వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more