సినీ హాస్యనటుడగా మంచి జోరుమీద దూసుకుపోతున్న కమేడియన్ పృథ్వీరాజ్.. నిజ జీవితంలో విలన్ లా వ్యవహరిస్తున్నారని అయనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఆయన భార్య కవిత పృథ్వీరాజ్ తనను కొంతకాలంగా వేధిస్తున్నారంటూ అమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కవిత తన మొదటి భర్త నుండి విడాకులు పోందిన తరువాత చిత్రసీమలో అవకాశాల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో అనీల్ అనే అమె సోదరి స్నేహితుడి ద్వారా అమెకు కమేడియన్ పృధ్వీరాజ్ కార్యాలయంలో పని చేసే అవకాశం లభించింది.
దీంతో 2010లో అమెను ఇంటర్వ్యూ చేసిన పృధ్వీరాజ్ అమెను తన కార్యాలయంలో పనికి కుదర్చుకున్నాడు. ఆటు పిమ్మట అమెకు ఖరీదైన వస్తువులను, విలువైన బహుమతులను ఇచ్చిన అయన తనను లోబర్చుకున్నాడని, దీంతో తామిద్దరం కలసి ఓ అలయంలో వివాహం కూడా చేసుకున్నామని కవిత పిర్యాదులో పేర్కోన్నారు. అప్పటికే ఇద్దరు పిల్లలు వుండటంతో వారిని కూడా తనపిల్లలుగానే చూసుకుంటానని హామి ఇచ్చారని, వారిని అయనే ఓ పాఠశాలలో కూడా చేర్చారని కూడా తెలిపింది. అయితే తాజాగా పద్మ అనే మహిళతో పృథ్వీ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కవిత ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ అక్రమ సంబంధంపై ప్రశ్నించినందుకు తనను హింసించాడని, తన నుంచి రెండు లక్షల నగదుతో పాటు బంగారం తీసుకున్నారని ఆరోపించారు. తనను ఇంట్లోకి రానివ్వడం లదేని, ఇదేంటని ప్రశ్నిస్తే తన ఇష్టమొచ్చినట్లు చేస్తానని ఎం చేసుకుంటావో చేసుకో అంటున్నారని.. ఇక ఈ విషయాన్ని పెద్దది చేస్తే తనను, తన పిల్లలను చంపుతానని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడని అరోపించారు. ఈ మేరకు పృథ్వీపై సెక్షన్ 420 మోసం, 498ఏ వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ ఎస్సై కే కృష్ణయ్య తెలిపారు. అయితే ఆ తరువాత పృధ్వీని క్షమించిన అమె భార్య, కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కూడా న్యాయస్థానంలో పిటీషన్ వేసినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more