30 ఇయర్స్ పృధ్వీపై గృహహింస వేధింపులు Actor Prithviraj's Wife drags him to the Court

Tollywood comedian balireddy prithviraj booked for harassment

cheating on actor prithvi raj, harassment caseon actor prithvi raj, Tollywood comedian prithviraj, Balireddy Prithviraj, Prithviraj, Film comedian, Police, Tollywood actor, wife kavitha, illegal affair, padma, banjarahills police station, tollywood news

The police on Sunday registered a cheating and harassment case against famous Tollywood comedian Balireddy Prithviraj on a complaint from his alleged wife.

30 ఇయర్స్ పృధ్వీని క్షమించిన సతి.. కేసు వాపస్

Posted: 10/10/2016 02:28 PM IST
Tollywood comedian balireddy prithviraj booked for harassment

సినీ హాస్యనటుడగా మంచి జోరుమీద దూసుకుపోతున్న కమేడియన్ పృథ్వీరాజ్‌.. నిజ జీవితంలో విలన్ లా వ్యవహరిస్తున్నారని అయనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఆయన భార్య కవిత పృథ్వీరాజ్ తనను కొంతకాలంగా వేధిస్తున్నారంటూ అమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కవిత తన మొదటి భర్త నుండి విడాకులు పోందిన తరువాత చిత్రసీమలో అవకాశాల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో అనీల్ అనే అమె సోదరి స్నేహితుడి ద్వారా అమెకు కమేడియన్ పృధ్వీరాజ్ కార్యాలయంలో పని చేసే అవకాశం లభించింది.

దీంతో 2010లో అమెను ఇంటర్వ్యూ చేసిన పృధ్వీరాజ్ అమెను తన కార్యాలయంలో పనికి కుదర్చుకున్నాడు. ఆటు పిమ్మట అమెకు ఖరీదైన వస్తువులను, విలువైన బహుమతులను ఇచ్చిన అయన తనను లోబర్చుకున్నాడని, దీంతో తామిద్దరం కలసి ఓ అలయంలో వివాహం కూడా చేసుకున్నామని కవిత పిర్యాదులో పేర్కోన్నారు. అప్పటికే ఇద్దరు పిల్లలు వుండటంతో వారిని కూడా తనపిల్లలుగానే చూసుకుంటానని హామి ఇచ్చారని, వారిని అయనే ఓ పాఠశాలలో కూడా చేర్చారని కూడా తెలిపింది. అయితే తాజాగా పద్మ అనే మహిళతో పృథ్వీ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కవిత ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ అక్రమ సంబంధంపై ప్రశ్నించినందుకు తనను హింసించాడని, తన నుంచి రెండు లక్షల నగదుతో పాటు బంగారం తీసుకున్నారని ఆరోపించారు. తనను ఇంట్లోకి రానివ్వడం లదేని, ఇదేంటని ప్రశ్నిస్తే తన ఇష్టమొచ్చినట్లు చేస్తానని ఎం చేసుకుంటావో చేసుకో అంటున్నారని.. ఇక ఈ విషయాన్ని పెద్దది చేస్తే తనను, తన పిల్లలను చంపుతానని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడని అరోపించారు. ఈ మేరకు పృథ్వీపై సెక్షన్ 420 మోసం, 498ఏ వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ ఎస్సై కే కృష్ణయ్య తెలిపారు. అయితే ఆ తరువాత పృధ్వీని క్షమించిన అమె భార్య, కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కూడా న్యాయస్థానంలో పిటీషన్ వేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles