పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల కార్యక్రమం రేపు (మార్చి 20) గ్రాండ్ గా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఆడియో విశేషాలను తెలియజేయడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... గతరెండు రోజులుగా అసలు ఈ ఆడియో వేడుక చేయాలా వద్దా అని అనుకున్నాం. పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సూచనల ప్రకారం.. ఈ వేడుకకు ఎవరైనా అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం వుందనే కారణంతో.. కేవలం పాసులు వున్న వారిని మాత్రమే అనుమతించబడటం జరుగును. కాబట్టి దయచేసి ఎంట్రీ పాసులు లేనివారి వేడుక బయట గుంపులు, గుంపులుగా వుండకండి. దయచేసి టీవిల్లోనే వేడుకను చూసి ఎంజాయ్ చేయగలరని చెప్పుకొచ్చారు.
నిజానికి నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఆడియో విడుదల చేయాలని అనుకున్నాం కానీ అక్కడ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో నోవాటెల్ లో ఆడియో విడుదల చేయాలని ఫిక్స్ చేసాం. అయితే అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు సూచించడంతో పలు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆడియో పాస్ లు లేనివారు మాత్రం అక్కడి రావద్దని నా విన్నపం. అభిమానులకు ఏమన్నా జరిగితే ఆ భాధ నాకే ఎక్కువ అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు కూడా రాబోతున్నారు అని పవన్ తెలియజేసారు. కేటీఆర్, హరీష్ రావు, డీజిపి, సీపి, పోలీసులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నాం. అక్కడ నాలాగే వుండే వాయిస్ తో డబ్బింగ్ చెప్పించనున్నాం. అనుకున్న సమయానికి ఏప్రిల్ 8న సినిమా విడుదల కానుంది. అయితే గతంలో ‘ఖుషి’ తర్వాత మూడు, నాలుగు హిట్లు వచ్చివుంటే సినిమాలు వదిలేసి వుండేవాణ్ని కావచ్చు. కానీ అలా జరగలేదు. సినిమాలను కేవలం ఎంటర్ టైన్మెంట్ తరహాలో చూస్తానని పవన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఎలాంటి పాట పాడలేదు. ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం తర్వాత ఎస్.జె. సూర్య దర్శకత్వంలో సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజన ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more