‘ఓకే బంగారం’ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో కార్తీ, దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, కీర్తి సురేష్ లు ప్రధాన పాత్రలలో ఎంపికయ్యారు. కానీ వరుస సినిమాలతో బిజీగా వుండటంతో దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దుల్కర్ స్థానంలో నానిని హీరోగా ఎంపిక చేసుకున్నారు.
ఇక త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని అందరూ భావించే సమయంలోనే కీర్తిసురేష్ షాకిచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో కీర్తిసురేష్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కీర్తిసురేష్ పాత్రలో ‘రేయ్’ భామ సయామీ ఖేర్ ను ఎంపిక చేసారు.
‘రేయ్’ సినిమాలో తన అందచందాలతో, డాన్సులతో పిచ్చెక్కించిన సయామీ ఖేర్ ను మణిరత్నం ఎంపిక చేసారు. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more