ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా జులై 10వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
‘బాహుబలి’ సినిమా కోసం అభిమానులే కాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీతారలు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మాములు జనాలకు ‘బాహుబలి’ టికెట్లు దొరకడం చాలా కష్టం అయిపోయింది. కానీ సినిమా వాళ్లకు మాత్రం వెంటనే ఫోన్ చేయగానే ఎన్ని టికెట్లు కావాలంటే అన్ని టికెట్లు వచ్చేస్తాయని అందరూ అనుకుంటూ వుంటారు. మాములుగా ఈ మాట నిజమే కావచ్చు. కానీ ఇక్కడ అన్ని సినిమాలు ఒక ఎత్తు... ‘బాహుబలి’ ఒక ఎత్తు.
‘బాహుబలి’ సినిమా ముందు అందరూ సామాన్య ప్రజలే అయ్యారు. ఆఖరి సినిమా వాళ్లు కూడా ‘బాహుబలి’ సినిమా టికెట్ల కోసం తెగ ప్రయత్నించేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత గోపి మోహన్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి’ టికెట్ల కోసం తను ఎలాంటి పరిస్థితిలో వున్నాడో ట్వీట్ చేసాడు.
‘బాహుబలి’ సినిమా టికెట్ల కోసం బంధువులు, స్నేహితుల వద్ద నుంచి చాలా ఒత్తిడి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో రచయితగా చేస్తున్నామ్.. ‘బాహుబలి’ సినిమా టికెట్స్ ఇప్పించలేవా... అంటూ గోపిమోహన్ కు తన వాళ్ల నుంచి ఒత్తిడి వస్తుందంటూ ట్వీట్ చేసారు.
గోపి మోహన్ చేసిన ట్వీట్ పై పలు సినీతారలు స్పందించారు. అందులో నటుడు వెన్నెల కిషోర్ స్పందిస్తూ... గోపి మోహన్... నేనైతే టికెట్లు బ్లాక్ లో కొనిస్తున్నాను. పాపం మా ఫ్యామిలీ అంతా నేనేదో తోపు అనుకుంటున్నారు. వాళ్లకు సింగల్ కాల్ తో టికెట్లు తెప్పించా అని చెప్పినా అంటూ ట్వీట్ చేసారు.
అలాగే ఇదే విషయంపై నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ... ‘వెన్నెల కిషోర్ కాక... బాహుబలి టికెట్స్ ఇప్పించవా ప్లీజ్. అంటూ ట్వీట్ చేసాడు. అలాగే ఈ ఇద్దరి కామెంట్లకు డిజైనర్ నీరజ కోన స్పందిస్తూ... బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్... బాహుబలి టికెట్స్ కావాలంటే కిషోర్ ను కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది అంటూ ట్వీట్ చేసింది. మరి ఇంకెంత మంది సినీతారలు ‘బాహుబలి’ సినిమా టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more