Mahesh babu new mother gracy singh koratala siva sruthi hassan

gracy singh latest news, gracy singh hot photos, gracy singh mother role, mahesh babu new movie, mahesh babu srimanthudu movie, sruthi hassan latest news, shruti hassan news, koratala siva news

mahesh babu new mother gracy singh koratala siva sruthi hassan : gracy singh to act mother role in mahesh babu latest movie. in this movie sruthi hassan pairing with mahesh and devisriprasad composing songs

తెరపైకొచ్చిన మహేష్ కొత్త తల్లి.. షాక్’లో మునిగిన టాలీవుడ్!

Posted: 01/18/2015 12:57 PM IST
Mahesh babu new mother gracy singh koratala siva sruthi hassan

వరుసగా అపజయాలు ఎదురవుతున్న సమయంలో ఓ హిట్’ని అందుకోవాలంటే అందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకైతే కథ నుంచి పాత్రల వరకు చాలా మార్పులు చేయాల్సి వస్తుంది కూడా! అప్పుడే.. ప్రేక్షకులకు కథ కొత్తగా అనిపించకపోయినా తారాగణాన్ని వీక్షించడానికైనా ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం టాలీవుడ్’లో ఈ ఫార్ములానే ఎక్కువగా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు కూడా దీన్నే నమ్ముకుని వున్నాడని తెలుస్తోంది. అందుకే.. తాను నటించబోయే తాజా చిత్రంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతోబాటు తారాగణాన్ని సైతం మార్చేస్తున్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో తల్లి పాత్రలో నటించేందుకు గ్రేసీ సింగ్’ను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ పాత్రకోసం ఎంతోమందిని పరిశీలించగా.. చివరికి గ్రీసీ సింగ్’ను సంప్రదించాల్సి వచ్చిందని యూనిట్ వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. దీంతో ఈ వార్త విన్న అనంతరం ఇండస్ట్రీలో వున్న ప్రముఖులతోబాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే.. ‘సంతోషం’ సినిమాలో నాగార్జున నటించిన గ్రేసీ సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! అంతేకాదు.. అమీర్ నటించిన ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ ‘లగాన్’లో కూడా ఈమె హీరోయిన్’గా నటించింది. కెరీర్ సాఫీగానే కొనసాగుతున్న తరుణంలో ఈమె అనుకోకుండా బ్రేక్ ఇచ్చేసింది. ఇక అప్పటినుంచి తెరపై కనిపించలేదు. అయితే.. ఇప్పుడు మహేష్’కి తల్లిగా నటించే ఆఫర్ ఆమెకి వచ్చిన నేపథ్యంలో తెరపైకి రాగా అందరూ షాక్’లో వుండిపోయారు.

ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్’గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ప్రచారంలో వుంది కానీ.. ఇంకా అధికారికంగా వెలువడి కాలేదు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తన బాణీలను ఈ చిత్రానికి అందిస్తున్నాడు. ఇంకా తారాగణాన్ని తీసుకునే క్రమంలోనే వున్న ఈ మూవీని వేసవిలోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles