(Image source from: Ram Charan Next movie Maranamrudangam in srinu vaitla direction)
ప్రస్తుతం ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమాతో ఫుల్ బిజీగా వున్న రామ్ చరణ్ తేజ.... ‘‘దూకుడు’’ సినిమాతో తన సత్తాను చాటుకుని వరుస విజయాలను అందుకుంటూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన శ్రీనువైట్లతో కలిసి మరో సినిమా చేయనున్నట్టు తాజా వార్తలు వినబడుతున్నాయి. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నవల ‘‘మరణమృదంగం’’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.
నవల కథ ప్రకారం... ‘‘ఓ హీరోయిన్ ను ప్రేమను గెలుచుకోవడానికి ఒక పార్ట్ టైమ్ చాలా ఎన్నో అవస్థలు పడతాడు. ఈ నేపథ్యంలోనే ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యాన్నే నాశనం చేస్తాడు. చివరికి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటాడు. అయితే అతను గూండా కాదు.. సీఐడీ ఆఫీసర్ అని తెలుస్తుంది’’. ఇది యండమూరి గారు రాసిన నవల! ఈ కథనే మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పట్లో సినిమా రూపంలో తీసి, భారీ విజయాన్నే అందుకున్నారు.
అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఈ నవలను కొంచెం అటూఇటూగా మార్చి, మహేష్ బాబుతో ‘‘పోకిరి’’ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా టాలీవుడ్ లోనే రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు అదే నవల ఆధారంగా దర్శకుడు శ్రీనువైట్ల, చెర్రీతో ఒక క్లాసిక్ సినిమా తీయాలనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్! ఒకవేళ ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించాలంటే... అందుకు కథలో చాలా మార్పులు చేయాల్సి వుంటుంది. అప్పుడే ప్రేక్షకజనాలు కూడా ఒక కొత్త అనుభూతిని పొందగలరు.
ఇంతకుముందు ‘‘జంజీర్’’ వంటి భారీ చిత్రంలో ఎటువంటి మార్పులు చేయకుండా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న చరణ్... ఇప్పుడు ఈ సినిమాను అదే కోవలోకి తెరకెక్కిస్తే చెర్రీ కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం వుందని అందరూ చర్చించుకుంటున్నారు. కాబట్టి చెర్రీ ‘‘మరణమృదంగం’’ వాయించాలంటే... ఈ సినిమాలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుందని... లేకపోతే అదే టైటిల్ తో ఒక కొత్త కథను ఎంచుకుంటే చాలా మంచిదని సినీ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more