రచయితగా తన సత్తా చాటుకొని, దర్శకుడిగా మారి ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివ. మిర్చి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మహేష్ తో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నాడు శివ. ఈ చిత్రానికి ‘‘పరాక్రమ’’ అనే టైటిల్ ఖరారు చేసారని గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ దర్శకుడు ఈ చిత్రంపై ఓ క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... బయట వచ్చే రూమర్లను నమ్మకండి. ఈ చిత్రానికి ఇంకా ఎలాంటి టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమా గురించి అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తామని అన్నారు. ఈ చిత్రం వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ మరియు సివి మోహన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Sandy
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more