ఈ ఏడాది భారత స్టాక్ మార్కె ట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలాగా ప్రవహిం చాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అందించిన సమాచారం ప్రకారం 2013లో ఇప్పటివరకు రూ. 91,892 కోట్ల (16.67 బిలియన్ డాలర్లు) మేరకు విదేశీ పెట్టుబడులు మన స్టాక్ మార్కెట్ లోకి ప్రవహించాయి.
భారతీయ ఈక్విటీ మార్కె ట్లోకి ఈ నవంబర్ నెలలో తొమ్మది రోజుల్లోనే రూ.3 వేల కోట్ల మేరకు విదేశీ పెట్టుబడులు వచ్చాయంటే మన స్టాక్ మార్కెట్ ఎంత కళకళ లాడుతూందో అర్థమవుతుంది. విదేశీ సంస్ధాగత మదుపుదారులు ఈ నెలలో స్టాక్మార్కెట్లో వాటాలను భారీగా కొనుగోలు చేశారు. పదిరోజు ల్లోపు వీరు 15,370 కోట్లమేరకు ఈక్విటీలను కొ నుగోలు చేశారని, ఇదే సమయంలోనే రూ.12,412 కోట్ల ఈక్విటీలను విక్రయించారని సెబీ తెలిపింది. మొత్తం మీద దేశంలోని వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ రూ.2,958 కోట్లుగా (480 మిలియన్ డాలర్లు) నమోదైంది.
స్టాక్మార్కెట్ తళతళ
సెప్టెంబర్- అక్టోబర్ నెలలు స్టాక్మార్కెట్కు పండగ వాతావరణాన్ని తలపించాయి. ఈ రెండు నెలల్లోనే రూ.28,700 కోట్ల మేరకు విదేశీ పెట్టుబడులు దేశంలోకి తరలి వచ్చాయి. అయితే ఈ నెలలో ఎఫ్ఐఐలు రూ.2,916 కోట్ల రుణ సెక్యూరిటీలను వెనక్కు తీసుకెళ్లారని, ఈ ఏడాది ప్రారంభం నుంచి రూ.53,070 కోట్ల మొత్తాన్ని రుణ మార్కెట్నుంచి ఉపసంహరించుకున్నారని సెబీ ప్రకటించింది.
అంతర్జాతీయ ద్రవ్యలభ్యత చురుకుగా కొనసాగడం, ద్రవ్య ఉద్దీపన ఉపసంహ రణను అమెరికా ప్రభు త్వం వాయిదా వేసు కోవడంతో ఈ సెప్టెంబర్ నుంచి స్టాక్ మార్కెట్లోకి ఎఫ్ఐఐలు వెల్లువలా ప్రవ హించాయి. ఈ నేపథ్యం లోనే ఆర్థిక మంత్రి పి. చిదంబరం నవంబర్ మొదట్లో ప్రకటన చేస్తూ దేశీయ కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని, ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోగలమని ధీమా వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 19 | ఓలా స్కూటర్ యూజర్లకు ఇటీవలే షాకిచ్చిన సంస్థ తాజాగా శుభవార్తను చెప్పింది. నెల రోజుల క్రితం ఓలా ఈవీ బైక్ ఎస్-1 ధరలను పెంచనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈవీ వాహనదారులు ఖంగుతిన్నారు. కాగా... Read more
Jan 18 | దేశంలోనే అధిక లాభాలు ఆర్జంచే బ్యాంకుగా ఆంధ్రాభ్యాంకును తీర్చిద్దేందుకు సంబంధిత అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం వచ్చే మార్చి మాసాంతానికల్లా దేశ వ్యాప్తంగా నూతనంగా మరో 212 బ్యాంకు శాఖలను, 800 ఎటిఎం... Read more
Nov 13 | ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్ఎసి)కి రాష్ట్రంలోని ఆరు ప్రాజెక్టులకు 10 వేల కోట్ల రుణాలు కోరుతూ ప్రతిపాదనలు వచ్చాయని ఆ సంస్థ సిఎండి డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా చెప్పారు. ఇప్పటికే 8... Read more
Nov 13 | ఒడిశాలోని జిఎంఆర్ కమలాంగ థర్మల్ విద్యుత్ ప్లాంట్ (జికెఇఎల్)లో 350 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్ వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిందని జిఎంఆర్ గ్రూప్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో తొలి యూనిట్ ప్రారంభమైన... Read more
Nov 11 | వారాంతంలో స్టాక్ మార్కెట్ బలహీనపడిన నేపథ్యంలో తొమ్మిది అగ్రశ్రేణి కంపెనీలు భారీ నష్టాలు చవి చూశాయి. రిలయన్స్, ఓఎన్జీసీ వంటి చమురు దిగ్గజాలు రూ.58,987 కోట్ల మార్కెట్ మూలధనం (ఎం-క్యాప్) కోల్పోయాయి. గత వారంలో... Read more