దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల ధోరణుల నేపథ్యంలో మార్కెట్ల ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా మారిషస్ పెట్టుబడులపై పన్ను ఎఫెక్ట్ దేశీయ సూచీలపై పడింది. ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని కేంద్రప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో, స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన అరగంటలోనే మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. సెన్సెక్స్ 105.37 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా, నిప్టీ కూడా 23.23 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.
ఫలితంగా మార్కెట్టు ముగిసే సమయానికి మార్కెట్లు మరింత నష్టాన్ని మూటగట్టుకున్నాయి. నిఫ్టీ బెంచ్ మార్క్ 7850 మార్కుకు దిగువన ట్రేడింగ్ ముగించింది. అటు సెన్సెక్స్ కూడా 25వేల 600 పాయింట్ల మార్కుకు దిగువ స్థాయికి చేరుకుంది, సెన్సెక్స్ 176 పాయింట్ల నష్టంతో 25 వేల 597 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 39 పాయింట్ల నష్టంతో 7850 మార్కుకు దిగవన ముగిసింది. నిఫ్టీ 7 వేల 849 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది, కాగా ఇవాళ మొత్తంగా 1103 సంస్థల షేర్లు లాభాల బాటలో పయనించగా, 1446 సంస్థల షేర్లు నష్టాలలో పయనించాయి, 158 సంస్థలకు చెందిన షేర్లు తటస్థంగా నిలిచాయి.
ఇవాళ్లి ట్రేడింగ్ లో రమారమి అన్ని సూచీలు నష్టాల బాటలో పయనించాయి. అటో, హెల్త్ కేర్, ఐటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, అయిల్ అండ్ గ్యాస్ సహా పలు సూచీలు భారీగా నష్టాలను ఎదుర్కోగా, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరెబుల్స్, మెటల్స్, ఎఫ్ ఎం జీ సీ, టెక్నాలజీ, చిన్నతరహా సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. కాగా బీఎస్సీ మధ్య తరహా పరిశ్రమల సూచీ మాత్రం స్వల్ప లాభాన్ని అర్జించింది. ఈ నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్, యాక్సిక్ బ్యాంక్ హిండాల్కో, బాస్చ్, కోటక్ మహీంద్ర తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, భారతీ ఇన్ప్రాటెల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more