Sensex ends over 300 points down on falling rupee, Chinese markets slide

Nifty cracks 8400 sensex sheds 324 pts fmcg outperforms

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Concerns over falling rupee amid weak global markets weighed down market sentiments as the key benchmark BSE Sensex and NSE Nifty closed 323.82 points and 122.40 points lower at 27,607.82 and 8,372.75.

300 పాయింట్లు సతనమైన సెన్సెక్స్.. 8400 దిగువన నిఫ్టీ..

Posted: 08/20/2015 09:04 PM IST
Nifty cracks 8400 sensex sheds 324 pts fmcg outperforms

రూపాయి మారకం విలువ క్రమంగా దిగజారుతున్న నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు చైనా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. చైనా మార్కట్ ప్రభావంతో దేశీయ రూపాయి మారకం విలువ అమెరికన్ డాలరుతో పోల్చేతే తీవ్రంగా పడిపోతున్న నేపథ్యంలో మదుపరులు అమ్మాకాలకు మొగ్గు చూపారు. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు గంట వ్యవధిలోనే ఒత్తిళ్లకు లోనయ్యాయి. దీంతో మార్కట్లు నష్టాలను చవిచూశాయి. చైనా మార్కెట్ ప్రభావంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా లాభాల దిశగా పయనించిన స్టాక్ మార్కెట్లు వాటిని అవిరి చేసుకుని ముగింపు సమయానికి స్వల్ప నష్టంతో ముగిశాయి.

మార్కెట్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 324 పాయింట్ల నష్టంతో 27,607 దగ్గర,  నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 8,373 వద్ద ముగిసింది.. ఆగస్టు మాసంలో సెన్సెక్స్ 84వందల మార్కకు దిగువన ట్రేడింగ్ సాగించడంతో ఇది రెండవసారి. ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్ సూచీల మినహా అన్ని సూచీలు నష్టాలను చవిచూశఆయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, అటో, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ గూడ్స్. ఐటీ సూచీలు భారీ నష్టాలను ఎదుర్కోన్నాయి.  మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్; పబ్లిక్ సెక్టార్ యూనీట్స్ టెక్నాలజీ, చిన్నతరహా, మద్య తరహా సూచీలు కూడా నష్టాల బాటలో పయనించాయి.  ఈ క్రమంలో లుపిన్, ఐటీసీ, బిపిసీఎల్; డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సన్ ఫార్మ సంస్థలు అధిక లాభాలను గడించగా, యస్ బ్యాంక్, కాయిర్న్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, రిలయన్స్, వేదంతా సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  RBI  

Other Articles