ఆర్థిక సంక్షోభాన్ని భర్తి చేసుకునే నేపథ్యంలో కరెన్సీ యువాన్ విలువను మరింతగా తగ్గిస్తూ మరోమారు చైనా నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ దేశ స్టాక్ మార్కెట్లతో పాటు మన దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కుదుపులకు గురై భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో నక్కల కూతలు వినిపించాయి. దీనికి తోడు పార్లమెంటు సమావేశాలు ప్రతిష్టంభనతో కీలక బిల్లులు సభలోకి రాకపోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో స్టాక్ మార్కెట్ల పతనానికి కారణంమయ్యాయి.
ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. భారీ కుదుపులకు గురైన దేశీయ సూచీలు ఎట్టకేలకు నష్టాలతోనే ముగిసాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 8400మార్కు దిగవన ట్రేడింగ్ సాగించింది. చైనా కర్సెనీ యువాన్ విలువను మరింత తగ్గించడం దేశీయ సూచీలను కుదిపేసింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలలో ప్రతిష్టంభన, కీలకమైన జీఎస్ టీ బిల్లును సభలో చర్చ జరగకపోవడతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి 354 పాయింట్లు కోల్పోయి సెన్సెక్స్ 27 వేల 512 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా మరోమారు 8400 మార్కుకు దిగువకు చేరింది. నిప్టీ 113 పాయింట్లను కోల్పోయి 8349 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ నేపథ్యంలో ఇవాళ 711 సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, 2124 సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 160 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఐటీ, టెక్నాలజీ సూచీలు మినహా అన్ని సెక్టార్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. బ్యాంకింగ్, అటో, క్యాపిటల్ గూడ్స్, ఎప్ఎంజీసీ, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, చిన్నతరహా పరిశ్రమల రంగానికి చెందిన సూచీలు సహా మధ్య తరహా పరివ్రమల సూచీలు నష్టాల్లో పయనించాయి. ఈ క్రమంలో వేదంత. హిందాల్కో, బిసిపీఎల్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎస్ బి ఐ సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూడగా, హెచ్ సి ఎల్ టెక్, ఇన్ఫోసిన్, టెక్ మహింద్రా, సన్ ఫార్మా, టీసీఎస్ సంస్థల షేర్లు అధిక లాభాలను గడించాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more