మీరట్... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా, ప్రముఖ నగరము. అత్యంత పురాతనమైన ఈ నగరం జాతీయ రాజధాని ఢిల్లీకి 70 కి.మీ దూరంలో వుంది. ఇది ఢిల్లీ తర్వాత రెండవ పెద్ద ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఆర్థికపరంగా బాగానే అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం నిజానికి ‘రావణ్ కీ ససురాల్’ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అంటే.. ‘రావణుడి అత్తగారిల్లు’ అన్నమాట! దీనికి ఈ పేరు రావడం వెనుక ఒక పురాణ కథ కూడా వుంది.
పురాణ ప్రాముఖ్యత:
రామాయణం ప్రకారం.. రావణుని మామ అయిన మయాసురుని చేత ఈ మీరట్ నగరం ‘మయరాష్ట్రం’గా స్థాపించబడింది. అంటే.. అప్పట్లో మయాసురు పాలనలో ఈ నగరం రాజధానిగా వుండేది. అందుకే ఈ పట్టణం ‘రావణ్ కీ ససురాల్’గా ప్రసిద్ధి చెందింది. ఏ విధంగా అయితే రావణుడు శ్రీలంకను ఎంతో అద్భుతంగా, అందంగా స్థాపించాడో.. మయాసురుడుగా కూడా అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అప్పట్లో విలాసవంతమైన హంగుఆర్భాటాలతో తీర్చదిద్దినట్లుగా పురాణాల్లో తెలుపుబడింది.
మీరట్ నగర విశేషాలు :
మీరట్లో ఓ సైనిక స్థావరం వుంది. ఇది విస్తీర్ణరీత్యా, జనాభారీత్యా భారతదేశంలో రెండవ పెద్ద సైనిక స్థావరంగా గుర్తింపు పొందింది. 1803 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ స్థావరాన్ని స్థాపించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమైనది కూడా ఈ ప్రాంతం నుంచే! 2007 సంవత్సరంలో మెట్రోపాలిటన్’గా ఈ నగరం ప్రకటించబడింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more