అక్షరధామ్... భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఎంతో అద్భుతంగా నిర్మించబడిన ఓ చారిత్రాత్మక కట్టడం! ‘‘అక్షరధామ్’’ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం పూర్తిపేరు ‘‘స్వామి నారాయణ్ అక్షరధామ్’’. దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన ఈ హిందూ దేవాలయాల సముదాయం... నవంబర్ 7, 2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. అయితే 8వ తేదీ నుంచి ప్రజలకు దర్శనీయప్రదేశంగా దీనిని తెరవడం జరిగింది. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో ‘‘నొయిడా క్రాసింగ్’’ వద్ద యమునా నది తీరాన ఎంతో మహొన్నంతంగా వెలసింది.
నిర్మాణం :
రాజస్తాన్ లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి కొన్ని వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు , పాలరాళ్ళను సేకరించడం జరిగింది. దీని నిర్మాణం కోసం అప్పట్లో చాలా సమయమే పట్టింది. అయితే ఈ నిర్మాణంలో విశేషమేమిటంటే.. ఈ కట్టడంలో ఒక్క అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడమే పెద్ద విచిత్రంగా మారింది. సాధారణ ఇళ్ల నిర్మాణానికే ఉక్కు వాడకం ఎంతో అవసరం. అటువంటిది ఇంత పెద్ద దేవాలయాల సముదాయంలో అస్సలు ఉక్కే వాడలేదు. అయినా ఇది ఎంతో దృఢంగా, అద్భుతంగా నిర్మించబడింది. అయితే ఈ అక్షరధాంని వైదిక స్థపత్య శాస్త్రాల (భవన నిర్మాణ కళకు సంబంధించిన) నిబంధనలమేరకే మలచడం ఒక విశేషం.
నిర్మాణశైలి :
వందఎరకాల భూభాగంలో నిర్మించిన బడిన ఈ కట్టడం భక్తిద్వార్, మయూర్ ద్వార్ అనే రెండు పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది. అక్షరధామ్ స్మారక భవనం, పలు గుమ్మటాలతో 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో, 370 అడుగుల నిడివితో నిర్మితమైంది. ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల ‘‘పరిక్రమ’’ స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టి వుంటుంది. దాని నిడివి దాదాపు రెండు కిలోమీటర్లు. 145 కిటికీలతో , 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.
141 అడుగుల ఎత్తుతో అలరారే అక్షరధామ్ ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ మూర్తి చెప్పుకోదగింది. ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఆలయంలో నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, కవులు, శిల్పకారుల చిత్తరువులు ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ స్వామి నారాయణ్ అక్షరధామ్ ని ప్రముఖ్ మహరాజ్ నిర్మించారు. న్యూఢిల్లీలోని ఈ ఆలయాన్ని 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్ జాతికి అంకితం చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more