తెలుగు రచయితల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న శంకరంబాడి సుందరాచారి... తెలుగు ప్రజలకు ఉమ్మడి ఆంధ్రరాష్ట్రానికి రాష్ట్రగీతమైన ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’’ అందించారు. ఆయన మాతృభాష తమిళం అయినప్పటికీ.. తెలుగుసాహిత్య రంగంలో మంచిపాత్రను పోషించారు. ఇతర రచయితలతో పోల్చుకుంటే ఈయన వ్యవహారశైలి చాలా భిన్నంగా వుంటుంది. అందుకు ఉదాహరణగా.. ఆంధ్రపత్రికలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఒక ప్రముఖునిపై పద్యం రాయవలసి వచ్చింది. అయితే ఆయన వ్యక్తులపై పద్యాలు రాయకూడదని భీష్మించుకుని.. ఆ ఉద్యోగాన్నే వదులుకున్నారు.
జీవిత విశేషాలు :
1914 ఆగస్టు 14వ తేదీన సుందరాచారి జన్మించారు. ఈయన మాతృభాష తమిళం అయినప్పికీ.. తెలుగులో ప్రావీణ్యం పొందారు. మదనపల్లెలో ఇంటర్మీడియెట్ వరకు చదివారు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు. ఒకనాడు తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. దాంతో తండ్రి మరోసారి మందలించగా.. అందుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆయన కడుపు నింపుకోవడం కోసం ఎన్నో పనులు చేశారు. తిరుపతిలో హోటలు సర్వరుగా, రైల్వే స్టేషనులో కూలీగా, ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా... ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు ఆయన నిర్వర్తించారు.
సాహితీ వ్యాసంగం :
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగీతమైన ‘‘మా తెలుగు తల్లికి’’ కూడా తేటగీతిలో రాసిందే! ఆ గీతంలో ఆయన రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నేపథ్యంలో.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది. మహాత్మాగాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది ‘‘బలిదానం’’ అనే కావ్యం వ్రాసారు. ‘‘సుందర రామాయణం’’ అనే పేరుతో రామాయణం రచించారు. అలాగే సుందర భారతం కూడా వ్రాసారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా ‘‘శ్రీనివాస శతకం’’ రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసారు. ‘‘ఏకలవ్యుడు’’ అనే కావ్యం, ‘‘కెరటాలు’’ అనే గ్రంథాలను రచించారు. ‘‘సుందర సుధా బిందువులు’’ అనే పేరుతో భావ గీతాలు వ్రాసారు. జానపద గీతాలు వ్రాసారు... స్థలపురాణ రచనలు చేసారు.
ఇలా ఈ విధంగా సాహితీరంగంలో ఎన్నో సేవలు చేసిన ఆయనను ‘‘శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం’’ ‘‘ప్రసన్న కవి’’ అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. ఈవిధంగా సాహిత్యరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. 1977 ఏప్రిల్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more