Kaloji narayana rao biography

kaloji narayana rao, kaloji narayana rao poems, kaloji narayana rao story, kaloji narayana rao history, kaloji narayana rao stories, kaloji narayana rao poets, kaloji narayana rao wiki, kaloji narayana rao news, kaloji narayana rao photos, kaloji narayana rao pictures

The biography of kaloji narayana rao who takes a part in telangana movement and wrote number of poems

కవిత్వాలతో తెలంగాణను నిద్రలేపిన కాళోజి!

Posted: 09/15/2014 01:19 PM IST
Kaloji narayana rao biography

నిజాంపాలనాకాలంలో వారి అరాచకాలకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన కలం ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజి నారాయణరావు. ఆనాడు నిజాంపాలనలో బలైపోయిన ప్రజలకోసం, వారి హక్కులకోసం కలం ఎత్తి ముందుకొచ్చిన ఈయన.. ఉద్యమాలను నడిపిన ప్రజావాది. తన జీవితం మొత్తాన్ని తెలంగాణాకిచ్చిన వైతాళికుడు కాళోజి. రాజకీయ, సాంఘిక చైతన్యాల సమూహారం! తెలంగాన ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వనిగా పిలువబడే ఈయన... ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజల మనిషి.

జీవిత చరిత్ర :

1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో కాళోజీ నారాయణరావు జన్మించారు. ఈయన తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు వంటి భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. అక్కడ ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివారు. తరువాత సిటీ కాలేజీలోనూ, హన్మకొండలోని కాలేజియేట్ హైస్కూలులోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశారు. 1939లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న ‘‘లా’’ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.

1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులోనే జైలుశిక్ష అనుభవించాడు.

మాడపాటి హనుమంతరావు , సురవరం ప్రతాపరెడ్డి , జమలాపురం కేశవరావు , బూర్గుల రామకృష్ణారావు , పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూరు విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(8 votes)
Tags : kaloji narayana rao  telangana movement  nizam ruling  hyderabad state  

Other Articles