A raja kanimozhi dayalu charged with money laundering case in 2 g case

2G scam case, A Raja, dmk mp, kanimozhi, money laundering, charge sheet, dmk, karunanidhi

A.raja kanimozhi dayalu charged with money laundering case in 2 G case

రాజా, కనిమొళి, దయాళు అమ్మాళ్ లపై చార్జిషీటు..

Posted: 10/31/2014 08:45 PM IST
A raja kanimozhi dayalu charged with money laundering case in 2 g case

2జీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో  కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళిపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈడీ దర్యాప్తు నివేదిక ఆధారంగా ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఐపీసీ 120-బి కింద నిందితులపై కేసు నమోదు చేసింది. నేరం రుజువైతే వీరికి ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.  ఎం.రాజా, కనిమొళితో పాటు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మళ్ సహా 16 మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి.  

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజా, కనిమొళి ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అలాగే స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్, వినోద్ గోయోంకాలపై కూడా అభియోగాలు నమోదు అయ్యాయి. మరోవైపు నిందితులు మాత్రం తాము ఎలాంటి నేరం చేయలేదని చెబుతున్నారు. తమపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి మారన్, ఆయన సోదరుడికి రెండు రోజుల క్రితం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2G scam case  A Raja  dmk mp  kanimozhi  money laundering  charge sheet  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more