అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్టీయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నుకోబడిన గవర్నర్లను ఒక్కొక్కరిగా తొలగించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే! వారి స్థానంలో తమ పార్టీలో వున్న సీనియర్ లీడర్లను గవర్నర్లుగా నియమించి.. తమ పార్టీని మరింత బలోపేతంగా మార్చుకునే దిశగా... ఇంకా పదవీకాలం వున్నప్పటికీ కాంగ్రెస్ గవర్నర్లను తమకు తామే స్వయంగా రాజీనామా చేసేలే బలవంతం చేసింది. ఏదైతేనేం.. ఈ విషయంలో బీజేపీ పార్టీ గెలిచిందన్న వాస్తవం మాత్రం నిజం! ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన గవర్నర్ల స్థానాలను భర్తీ చేసే విషయంలో భాగంగా... బీజేపీ పార్టీ తరఫు నుంచి 4 సీనియర్ నాయకులను నియమిస్తున్నట్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. అందులో.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గానూ.. గోవా గవర్నర్ గా మృదుల సిన్హా, కర్నాటక గవర్నర్ గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్ గా కల్యాణ్ సింగ్ తదితరులు నియమితులయ్యారు.
ఇందులో ముఖ్యంగా మన తెలుగు నాయకుడైన విద్యాసాగర్ రావు విషయంలో మాత్రం కొంచెం విచిత్రం చోటుచేసుకుంది. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే.. అది ఆయన అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు మహారాష్ట్ర గవర్నర్ గా వున్న కె.శంకరనారాయణన్ ను మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారంరాత్రి ఆదేశాలు జారీ చేస్తే.. అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో గవర్న్ సీటు ఖాళీ అయిన నేపథ్యంలో ఆ స్థానంలో సీహెచ్ విద్యాసాగరరావును నియమిస్తున్నట్టు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. విద్యాసాగర్ రావు గతంలో రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకసారి కేంద్ర సహాయమంత్రిగానూ, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more