తమ మీద ఎవరు, ఎక్కడ, ఏ సమయంలో అత్యాచారాలు చేస్తారోనన్న భయంతో విదేశీ భామలు ఇండియాకు రావడానికి చాలా భయపడుతున్నారని సమాచారం! ఇండియాను ‘‘అత్యాచారాల’’ కంట్రీగా అభివర్ణిస్తున్న ఆ భామలు... ఇండియాపేరు చెప్తే అస్సలు ఆసక్తి చూపించడం లేదని సమాచారం! అయితే వారు ఎందుకంతగా భయపడుతున్నారోనన్న కోణంలో ప్రశ్నించగా.. అందుకు వారు మన దేశంలో జరిగిన నిర్భయ ఘటనను నిదర్శనంగా చూపిస్తున్నారు.
రెండేళ్లక్రితం మన దేశరాజధాని న్యూఢిల్లీలో అందరినీ కలచివేసే నిర్భయ ఘటన జరిగిన తర్వాత... ఆ నగరానికిగానీ, ఇండియాకు రావడానికిగానీ వచ్చేందుకు విదేశీ పర్యాటకులు భయపడుతున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. భారత పురావస్తుశాఖ ఈ విషయాన్ని గణాంకాలతో తేల్చిమరీ వెల్లడించింది. మన భారతదేశంలో ప్రాచీనకాలానికి చెందిన ఎన్నో కట్టడాలున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని కుతుబ్ మీనార్, హుమయూన్ టూమ్స్, ఎర్రకోట వంటి ఎంతో ప్రముఖమైనవి. వీటిని వీక్షించడానికి లక్షలాది విదేశీ పర్యాటకులు నిత్యం తరలి వస్తుంటారు. కానీ నిర్భయ ఘటన అనంతరం పర్యాటకుల సంఖ్య తక్కువ అవుతోందని వారు స్పష్టం చేశారు.
విదేశీ పర్యాటకులతోపాటు స్వదేశీ పర్యాటకులు కూడా ఢిల్లీలో విహరించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని పురావస్తు శాఖ కొన్నిలెక్కలను తేల్చిన అనంతరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో వున్న హుమయూన్ టూమ్స్ ను సందర్శించిన పర్యాటలకు సంఖ్య 2011తో పోల్చుకుంటే 2012లో రెట్టింపు కాగా.. 2013లో (నిర్భయ ఘనట తర్వాత) ఒకేసారి 30 శాతం పడిపోయినట్లు వారు తెలుపుతున్నారు. అలాగే కుతుబ్ మీనార్ ను చూడటానికి 2011లో 30 లక్షలు రాగా, 2012లో అది 35 లక్షలకు చేరింది. కానీ 2013లో మాత్రం కేవలం 32 లక్షల పర్యాటకులు మాత్రమే సందర్శించారు.
కేవలం ఈ మూడు చారిత్రాత్మక కట్టడాలకే కాదు.. దేశంలో వున్న ఇతర ప్రముఖ కట్టడాలు జంతర్ మంతర్, పురానా ఖిల్లా, ఇంకా తదితర పర్యాటక ప్రదేశాలను సందర్శించుకునే పర్యాటకుల సంఖ్య దాదాపు పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాదిలో న్యూఢిల్లీని ‘‘వరల్డ్ హెరిటేజ్ సిటీ’’గా యునెస్కో ప్రకటించనున్న నేపథ్యంలో.. ఈ ప్రభావం ఏమేరకు పడతుందోనన్న భయంతో పురావస్తు శాఖ ఆందోళనకర పరిస్థితుల్లో మునిగిపోయిందని పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more