ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఉద్వాసన తప్పదా? అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడని ఆయనపై అసంతృప్తితో ఉన్న సీఎం చంద్రబాబు త్వరలో ఆయనను ఆ పదవీ నుంచి తొలగించి కేబినెట్ లోకి తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. అతిత్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో కేబినెట్ లో పలు కీలక మార్పులు తప్పవనే సంకేతాలు ఇప్పటికే చంద్రబాబు అందించారు కూడా. ఇదేం కొత్త వార్త కాదు. గత కొంతకాలంగా ఇదిగో మంత్రివర్గ విస్తరణ అన్నప్పుడల్లా అదిగో కోడెల ఊస్టింగ్ అంటూ వినిపించిందే. కానీ, ఈసారి కోడెలకు ప్రత్యామ్నాయం కూడా దొరికినట్లు ఉప్పదింస్తున్నాయి టీడీపీ వర్గాలు. మరి ఆస్థానంను భర్తీ చేసేది ఎవరు?
ఈ రేసులో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రముఖంగా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చాక జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ధూళిపాళ్లకు అవకాశం లభిస్తుందని అంతా భావించారు. అయితే తన సామాజిక వర్గమే అడ్డుగా నిలవటంతో ఆయనకు ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్సయ్యింది. దీంతో ఈ దఫా ఎలాగైనా ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి కాకుండా ఏకంగా స్పీకర్ పదవినే ధూళిపాళ్లకు కట్టబెట్టబోతున్నారంట. ఈ వ్యవహారమై ఇప్పటికే సీనియర్లతో మంతనాలు కూడా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దూకుడు ప్రదర్శించే నరేంద్ర అయితేనే నిర్ణయాలు తీసుకోవటంలోనూ, ప్రతిపక్షాలను అదుపుచేయటంలోనూ సమర్థవంతంగా వ్యవహారిస్తాడన్న భావనలో బాబు ఉన్నట్లు భోగట్టా.
ఇక స్పీకర్గా ఉన్న కోడెలకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు ప్రాధమికంగా నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైద్య శాఖ మంత్రిగా కోడెల విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఆయనకు అదే శాఖను అంటగట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది. పనిలోపనిగా కడపపై కాంసంట్రేషన్ చేసిన బాబు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్న సతీష్ రెడ్డికి కేబినెట్లో అవకాశం ఇస్తారన్న వార్తలు కూడా జోరుగా ఊందుకుంటున్నాయి. మొత్తానికి రాజకీయ మార్పులను గమనిస్తుంటే విజయదశమికి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో పలు ఆసక్తికర మార్పులు చోటుచేసుకోబోవచ్చేనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more