టాలీవుడ్ సీతమ్మ మరోసారి అంటూ కోర్టును ఆశ్రయించింది. తన కు రక్షణ కావాలని అంజలి కోర్టుకెక్కింది. నిన్నటి వరకు అంజలిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు అంజలి రక్షణ కోరుతూ కోర్టుకెక్కటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ దర్శకుడి వల్ల ఎలాంటి ప్రమాదం లేదట, ఇప్పుడు కొత్త గా ఆమె కుటుంబ సభ్యుల నుండి రక్షించండని అంజలి అడుగుతుంది. పిన్ని భారతి, బాబాయ్ హరిబాబు తనను మానసికంగా వేధిస్తున్నారంటూ కోర్టుకెక్కింది. వారిద్దరిపై అంజలి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిన్ని, బాబాయ్ పై తగిన చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని మొరపెట్టుకుంది.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు.. ఈ కేసును విచారించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. గతంలో కూడా అంజలి పిన్ని భారతిపై ఆరోపణలు చేసింది. పిన్ని, డైరెక్టర్ కళంజియం నుంచి తనకు హాని ఉందని పేర్కొంది.
తన ఆస్తులను దోచుకున్నారని, తనను ఏటీఎమ్ కార్డులు వాడుకుంటారని వారిపై విమర్శలు చేసింది. కాగా అంజలి కోసం తాను 70 లక్షల రూపాయలు ఖర్చు చేశానని, తనకు ప్రతి నెలా 50 వేల రూపాయలు ఇచ్చేలా అంజలిని ఆదేశించాలని కోరుతూ భారతి చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత పిన్నికి దూరంగా ఉంటున్న అంజలి మరోసారి ఆమెపై ఫిర్యాదు చేసింది. అంజలి మరోసారి తన కుటుంబ సభ్యుల పై ఎందుకు ఫిర్యాదు చేసిందో ఎవరికి అర్థం కావటం లేదు. అంజలి కోర్టు కష్టాలు ఎప్పటికి తీరుతాయో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more