చంద్రబాబు నాయుడు నా భర్తను వాడుకుంటున్నారని ఎన్టీఆర్ భార్య వాపోతుంది. అంటే జూనియర్ భార్య లక్ష్మీప్రణితి కాదులేండి. పెద్ద ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ప్రతిసారి ఎన్టీఆర్ ఘాట్ ను వాడుకుంటుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ఏమి అమలు చేశారని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు వస్తున్నారో చెప్పాలని లక్ష్మీపార్వతి నిలదీశారు. తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ అనుకున్నారని.....అలాంటిది విభజనకు ఒప్పుకున్నాక ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు రావడం ఎందుకు అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.
స్వార్థం కోసమే ఢిల్లీలో బాబు దీక్ష చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జాతీయ నేతలను పిలిపించుకుని...తన పలుకుబడి చూపించడానికే బాబు దీక్ష చేస్తున్నారన్నారు. చంద్రబాబులా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నేత మరొకరు లేరని లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్గంలోనే టీడీపీ కూడా పయనించాలన్నారు. ఆర్టికల్ 3 విషయంలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టడం సరికాదని అన్నారు.
120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆర్టికల్ 3 గురించి తెలియదా అని లక్ష్మి పార్వతి సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించనందునే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేపడుతున్న సందర్బంగా ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more