Andhra telugu political news purandeswari happy chandrababu upset

ntr statue in parliament, purandeswari happy, chandrababu upset, telegu desam party,tdp founder nt rama raos statue, daughter d purandeshwari, congress mp and a minister, upa government, tdp leaders,

purandeswari happy -chandrababu upset

తండ్రి రుణం తీర్చుకున్న కన్న కూతురు పురంధేశ్వరి.

Posted: 05/07/2013 12:53 PM IST
Andhra telugu political news purandeswari happy chandrababu upset

13 ఏళ్ల పోరాటం నేటితో తెరపడింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం ఢిల్లీ పార్లమెంట్ భవనం ఎదుట నిలిచింది. తెలుగువారి ఘనతను సాటే విధంగా ఈరోజు పార్లమెంట్ ఆవరణంలో ఎన్టీఆర్ విగ్రహం కనబడుతుంది. ఎన్నో వివాదాలు, విమర్శలు, లేఖల ప్రయోగాల మద్య నలిగి, చివరకు ఎన్టీఆర్ విజయం సాధించారు. తన తండ్రి విగ్రహాన్ని ఢిల్లీ పార్లమెంట్ ఆవరణంలో పెట్టడానికి ఎన్నో ఒడుదుడుకులను దాటుకోని, చివరకు తండ్రి రుణం తీర్చుకున్న కూతురిగా పేరు తెచ్చుకుంది కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంథేశ్వరి. ఎన్టీఆర్... యావత్ తెలుగుజాతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలుగుగడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరిది. పైగా ఆయనకు వారసులం అని చెప్పుకునే అరడజను మంది కుమారులు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మనుమలు ఉన్నారు. అయినా అంత మందిలో ఒక్కరు కూడా ఎన్టీఆర్ చనిపోయి 18 సంవత్సరాలవుతున్నా కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. చంద్రబాబు తన హవా కేంద్రంలో ఉన్నప్పుడు , తన నేత బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి వచ్చినా కూడా అది జరగనీయలేదు., కాంగ్రేస్ పార్టీలో ఉంటూ కన్నతండ్రి రుణం తీర్చుకున్నారు పురంధరీశ్వరి.

తెలుగుతేజం ఎన్టీఆర్ గొప్పదనం యావత్ భారతజాతి మననం చేసుకుంటూ ఉండేలా పార్లమెంట్ లో ఆయన విగ్రహాన్ని పెట్టించింది. ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకోనున్నారు. టిడిపి అధినేత, మరికొందరు ముఖ్యనేతలు, తెలుగుదేశం ఎంపీలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ లో 9 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టమెంట్ లో ఇదే అతిపెద్ద విగ్రహం కావడం విశేషం రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు లోక్ సభ స్పీకర్ మీరాకుమారిని కలసి రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. పార్టమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యులు పార్లమెంట్ కు చేరుకున్నారు. విగ్రహావిష్కరన పట్ల ఎన్టీఆర్ సొంత జిల్లా క్రిష్ణా జిల్లా వాసులు ఆనంద వ్యక్తం చేసారు. పలువురు స్థానికులు మాట్లాడుతూ ఎన్టీఆర్ తో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్పీకర్ మీరాకుమారి ఆవిష్కరించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, అధ్వాని, కేంద్రమంత్రులు ఆజాద్, జైరాంరమేష్, చిరంజీవి, జైపాల్ రెడ్డి, షిండే, కిల్లి కృపారాణి, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య కళ్యాణ్ రాం, ఎంపీలు గుత్తా, మాగంటి, లగడపాటి దంపతులు, ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. . అయితే సోనియాగాంధి రాకపోవడాన్ని రాజ్యసభ సభ్యుడు హన్మంతరావు సమర్థించారు. ఎన్టీఆర్ ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి, కాంగ్రేస్ పార్టీని విమర్శించారు, అందుకే ఆమె హాజరుకాలేదని చెప్పారు. అయితే అక్కడే చంద్రబాబు పరిస్థితి మరోల మారిపోయింది.. కేంద్ర మంత్రి పురంథేశ్వరి విజయ దరహాసంతో కనిపించింది. కానీ చంద్రబాబు సిగ్గుతో తలదించుకున్నట్లు గా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెయ్యలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వ అండతో.. కేంద్రమంత్రి పురంథేశ్వరి సాధించింది.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడితే బాగుండేదని టిడిపి నాయకులు అంటున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో తమ పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహావిష్కకరణకు., మేము ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చిందని టిడిపి సీనియర్ నాయకులు అంటున్నారు.. ఈ ప్రక్రియా రాబోయే రోజుల్లో .. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.. టిడిపి కి ఒకరకంగా ఇది పెద్ద దెబ్బలాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more