కడప జిల్లాలోని బ్రాహ్మణి స్టీల్స్కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రకటించింది. బ్రాహ్మణి స్టీల్స్కు కేటాయించిన 10,766 ఎకరాల భూమి కేటాయింపులకు సంబంధించిన అవగాహన పత్రంపై 2007 మే 21న సంతకాలు జరిగాయి. ఆ పనులు సకాలంలో పూర్తి కానందున ఇప్పుడు దీన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణం విషయంలో నిబంధనలను పాటించకపోవడంతో భూకేటాయింపు జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. సకాలంలో బ్రాహ్మణి స్టీల్స్ పూర్తి కాలేదు. ఈ కర్మాగారానికి ఉపయోగించుకునేందుకు కేటాయించిన ఓబుళాపురం గనుల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణ కూడా ఉంది. కడప జిల్లా జమ్మలమడుగులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్కు భూమిని కేటాయించింది. విమానాశ్రయం ఏర్పాటు వంటివాటికి కూడా ప్రభుత్వం భూమి కేటాయించింది.
బ్రాహ్మణి స్టీల్స్కు సంబంధించి కొన్ని పనులు మాత్రం జరిగాయి. దీంతో అక్కడ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఆసక్తిని ప్రదర్సిస్తున్నాయి. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి కేటాయించిన గనులను తమకు కేటాయిస్తే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగే అవకాశాలున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు బ్రహ్మణి ఇండస్ట్రీస్తో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో 2007 మే 21న పరిశ్రమల శాఖ ఒప్పందం చేసుకుంది. 20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతామని, 2017 నాటికి తమ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులకు చేరుతుందని బ్రాహ్మణి అప్పట్లో తెలిపింది. ఈ ప్లాంటుద్వారా పది వేల మందికి ప్రత్యక్షంగా,
మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపింది. ప్రతిపాదిత యూనిట్కు రాయితీలు, ప్రోత్సాహకాలు కోరింది. ఈ ప్రతిపాదనలను 2007 మే 21న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) భేటీలో ఆమోదించగా ప్రభుత్వం జీవో 477 జారీచేసింది. తర్వాత ప్రాజెక్టుకు 10,760.66 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది. ఎకరా రూ.18 వేల చొప్పున ఈ భూ కేటాయింపులు చేశారు. అలాగే జమ్మలమడుగు మండలం అంబవరంవద్ద వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటుకు మరో 3115 ఎకరాలు కేటాయించింది. ఈ భూమి ధరను ఎకరా రూ.25వేలుగా నిర్ణయించింది. బ్రహ్మణి స్టీల్స్ కోసం గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని కేటాయిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2005-10 పారిశ్రామిక విధానం ప్రకారం బ్రహ్మణి ఇండస్ట్రీస్కు రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ, ఇతర అనుమతులు పొందడానికి బ్రహ్మణి ఇండస్ట్రీస్కు సహకరించాలని తీర్మానించింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more