ఎంపీలు, మాజీ ఎంపీలు బకాయిపడ్డ ఫోన్ బిల్లులు మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 7.3 కోట్లు. ఇవి సాక్షాత్తూ మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్) అందించిన వివరాలు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలున్నప్పటికీ ఫోన్లు కట్ చేయడం లేదు. టెలిఫోన్ సర్కిల్ చీఫ్ ఆదేశాలు ఉంటే తప్ప కట్ చేయడానికి వీలులేదని ఎంటిఎన్ఎల్ స్పష్టం చేసింది. సబార్డినెట్ అధికారికి ఫోన్ కట్ చేసే అధికారం లేదని ఆర్టిఐకి ఇచ్చిన వివరణలో సంస్థ పేర్కొంది. బకాయిల వసూలుకు సంబంధించి సర్కిల్ హెడ్ లేఖ రాయాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా టెలికం మేనేజర్ లేదా సర్కిల్ హెడ్ ఆదేశిస్తే తప్ప ఎంపీల ఫోన్లు తొలగించడానికి వీలులేదన్నారు. సుభాష్ అగర్వాల్ అనే వ్యక్తి ఎంపీల ఫోన్ బకాయిలకు సంబంధించి వివరాలు కావాలని ఆర్టిఐను ఆశ్రయించాడు. ప్రస్తుత, మాజీలు కలిపి 405 మంది ఎంపీలు 7.3 కోట్ల మేరకు టెలిఫోన్ బిల్లులు బకాయి పడ్డారని ఎంటిఎన్ఎల్ పేర్కొంది. 399 మంది మాజీలు, ఆరుగురు ప్రస్తుత ఎంపీలు కలిపి మొత్తం 7,30,66,746 బకాయి ఉన్నటు వివరించారు. బకాయిల జాబితాలో ఉన్న మాజీల్లో 67 మంది చనిపోయారు కూడా. టెలిఫోన్ బిల్లుల విషయంలో ఎంపీల నుంచి ఎప్పటికప్పుడు సొమ్ములు రాబట్టాలని ఢిల్లీ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. కృషక్ భరత్ అనే ఎన్జివో దాఖలు చేసిన పిల్పై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more