రాజకీయ ప్రయోజనాల కోసమే తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. ‘తనను మంత్రి పదవి నుంచి తప్పించినా తనపై ఎలాంటి ప్రభావం ఉండబోదని’ గడ్కరీ అన్నట్లు ఓ వీడియో మీడియాలో వైరల్ అయింది. ఈనేపథ్యంలో ఈవీడియోపై నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే అలాంటివారిపై న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోనని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు.
తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారంటూ తాను మాట్లాడిన పూర్తి వీడియోను నితిన్ గడ్కరీ ట్వి్ట్టర్ లో పంచుకున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు తనపై నీచ ప్రచారాలకు తెరలేపారని.. కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు సామాజిక మాద్యమ వేదికల్లోనూ తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. ఇలాంటి మోసపూరిత ప్రచారాలను పెద్దగా పట్టించుకోనని.. ఇలాంటివి కొనసాగితే న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా, పీఎంవో కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన మాట్లాడిన అసలు వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ తన గతానుభవాల్ని పంచుకుంటూ ఓ గ్రామానికి రోడ్డు వేసే సందర్భంగా అక్కడి అధికారులతో జరిగిన సంభాషణను గడ్కరీ ప్రస్తావించారు. జరుగుతున్న పర్యవసానాల గురించి నేను బాధపడను, కానీ నేను ఈపనిచేస్తాను.. వీలైతే తనకు అండగా నిలబడండి అని అధికారులతో గడ్కరీ అన్నారు. ఈ ఒక్క వాక్యాన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించినందుకే గడ్కరీ ఈవ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రస్తావించారు. ఈ ప్రచారంపై స్పందించారు. అసత్య ప్రచారాలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు.
आधी हकीकत, आधा फसाना.. देखें किस तरह चार दिन पहले मुंबई में श्री नितिन गडकरी जी के वक्तव्य का प्रोपेगेंडा तैयार किया गया। pic.twitter.com/5j0I8lPtHR
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) August 25, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more