వరుణుడు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలపై తన ప్రభావాన్ని చాటిన నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కోంటున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పరామర్శించేందుకు కొడగు పర్యటనకు వెళ్లిన కర్నాటక మాజీ సీఎం, విపక్ష నేత సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనానికి బీజేపి, హిందుత్వ కార్యకర్తలు నల్ల జెండాలు చూపుతూ నిరసన ప్రదర్శనకు దిగారు. ఆయన కాన్వాయ్పై కోడిగుడ్లు విసిరి మరీ తమ వ్యతిరేకతను చాటారు. ఈ ఘటన గురువారం జరిగింది. అయినా వీటిని పెద్దగా పట్టించుకోని సిద్దరామయ్య.. ఇవాళ చికమంగళూరు ప్రాంతంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి అక్కడి బాధితులతో పరామర్శించారు.
కొప్పా, శృంగేరి తాలుకాల్లోని పలు వరద ప్రాంతాలను సందర్శించిన ఆయన అక్కడి బాధితులతో వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన శృంగేరిలోని శారదా పీఠాన్ని సందర్శించారు. ఆ తరువాత బలేహోన్నూర్ లోని జగద్గురు రంభాపురి పీఠాధిపతి ప్రసన్న వీరసోమేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ పర్యటనను ముగించుకుని తిరుగివస్తున్న క్రమంలో ఆయన వాహనాన్ని శృంగేరి తాలుకాలోని మెనేసి గ్రామంతో పాటు కొప్పా తాలుకాలోని మక్కికొప్పాలోనూ ఆపేందుకు బీజేపి యువమోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని చెదరగొట్టడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక ఈ పర్యటన నేపథ్యంలోనూ ఆయన కారుకు నల్లజెండాలు ప్రదర్శించారు హిందుత్వ కార్యకర్తలు. ఈ ఘటన నేపధ్యంలో కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన వీరు తనను బతకనిస్తారా అని ప్రశ్నించారు. గాంధీని కాల్చిచంపిన గాడ్సే ఫోటోను బీజేపీ శ్రేణులు పూజిస్తున్నాయని మండిపడ్డారు. కొడగు పర్యటనలో బీజేపీ కార్యకర్తలు నిరసనలకు, కోడిగుడ్ల దాడికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని ఆయన అరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకుండా కాలయాపన చేసిందని, ఆ విషయాలు తన పర్యటనలో ఎక్కడ వెలుగులోకి వస్తాయోనని ఈ తరహా నిరసనలకు బీజేపి దిగిందని ఆయన అరోపణలు చేశారు.
కొడుగు జిల్లా ఎస్పీపై సిద్దరామయ్య తీవ్రంగా ఫైర్ అయ్యారు. తన పర్యటనలో ఇలా నిరసనలు వ్యక్తంచేస్తారన్న విషయం ఆయనకు తెలుసా.? తెలియదా.? అని ప్రశ్నించారు. జిల్లాలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. తన పర్యటన నేపథ్యంలో మందస్తు అరెస్టులు ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఇదే విధంగా ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై పర్యటనలోనూ వ్యవహరిస్తారా.? అని ప్రశ్నించారు. ఇక సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్నాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ ఎవరైనా నిరసన తెలపవచ్చని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని హెచ్చరించారు. సిద్ధరామయ్యకు తగినంత భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more