చిన్న మొత్తమే కదా.. పోనిద్దురూ అంటూ ఎందరకు ఎన్ని రకాలుగా చెప్పినా.. పోరాట యోధులు.. తమలోని శక్తినంతా కూడగట్టుకుని సలిపే పోరాటంలో సాధించే విజయం.. వారి వ్యక్తిగతం కాదు.. ప్రజాప్రయోజనం ఇమిడి ఉందని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పోరాట యోధుల కారణంగానే నగరంలో పార్కింగ్ ఫీజుల మాఫియాకు కళ్లెం పడింది. వీరి పోరాటం ఫలితంగానే థియేటర్లలో తినుబండారాలపై అడ్డగోలు దోపిడి అంతమయ్యింది. వీరి కారణంగానే అనేక హోటళ్లు, దుకాణాల్లో వాటర్ బాటిళ్ల ధరపై అధికంగా చేసే వసూళ్లకు చెక్ పడింది. వీరి కారణంగానే దుకాణాలు, మాల్ లలో లభించే క్యారీ బ్యాగుల వసూళ్లలపై కొరడా జుళిపించింది.
ఇలాంటి పోరాటాన్నే గత 22 ఏళ్లుగా కొనసాగిస్తున్న మరో యోధుడు చివరకు విజేతగా నిలిచాడు. రూ.20 కోసం 22 ఏళ్లు కోర్టు చుట్టూ తిరగడం కాస్త విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ, న్యాయం బతికుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు తుంగనాథ్ చతుర్వేది. దీని కోసం రైల్వేతో 22 ఏళ్లు చేసిన న్యాయ పోరాటంలో విజయం సాధించాడు. వివరాల్లోకి వెళితే, 1999లో, చతుర్వేది ఉత్తరప్రదేశ్లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో కొనుగోలు చేసిన టిక్కెట్లకు 20 రూపాయలు అదనంగా తీసుకున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన కన్జ్యూమర్ కోర్టులో నార్త్ ఈస్ట్ రైల్వేకు వ్యతిరేకంగా కేసు వేశారు.
ఈ కేసుకు సంబంధించి ఆయన 100 కంటే ఎక్కువ విచారణలకు హాజరయ్యాడు. అయితే, రైల్వేకు వ్యతిరేకంగా ఫిర్యాదులను రైల్వే ట్రిబ్యునల్కు పరిష్కరించాలని, వినియోగదారుల కోర్టుకు కాదని రైల్వే కేసును కొట్టివేయించేందుకు ప్రయత్నించింది. కానీ, స్వయంగా న్యాయవాది అయిన చతుర్వేది, 2021 సుప్రీం కోర్ట్ తీర్పును బట్టి ఈ కేసు వినియోగదారుల కోర్టులో విచారించవచ్చని నిరూపించారు. ఇక, 22 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, వినియోగదారుల కోర్టు ఆయనకు సానుకూలంగా తీర్పును వెలువరించింది.
బాధితునకు 15,000 రూపాయలు జరిమానా చెల్లించాలని, సంవత్సరానికి 12 శాతం వడ్డీతో 20 రూపాయలను అతనికి తిరిగి చెల్లించాలని రైల్వేని ఆదేశించింది. నిర్ణీత 30 రోజులలోపు చెల్లించకపోతే వడ్డీ రేటును 15 శాతానికి పెంచుతామని కోర్టు పేర్కొంది. దీనిపై చతుర్వేది స్పందిస్తూ, "డబ్బు ముఖ్యం కాదు, ఇది న్యాయం కోసం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం. కనుక ఇది విలువైనది" అని అన్నారు. అలాగే, "నేను స్వయంగా న్యాయవాదిని కాబట్టి, న్యాయవాదికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్టుకు వెళ్లడానికి అయ్యే ఖర్చును భరించాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రజలకు అది చాలా ఖరీదైంది కావచ్చు," అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more