దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొనసాగుతోంది. వాక్సీన్ అందుబాటులోకి రాగానే ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా 60 ఏళ్లకు పైనున్న పెద్దలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారికి ఇచ్చారు. ఆ తరువాత 45ఏళ్ల పైబడిన వారికి ఆ తరువాత 18 ఏళ్ల పైబడిన వారికి ఇక తాజాగా ఐదేళ్ల పైబడిన చిన్నారుకు కూడా కరోనా టీకాలను ఇస్తూ.. దేశంలోని అందరినీ కరోనా నుంచి విముక్తులను చేస్తున్నారు. ఈ క్రమంలో రెండో డోసును కూడా దాదాపు దేశప్రజలందరికీ ఇచ్చారు. ఇక తాజాగా కూడా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతోంది.
దీంతో దేశంలో 60 ఏళ్ల పైబడినవారందికీ కరోనా బూస్టర్ డోసులు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే 60 ఏళ్ల లోపు వావరైనా కరోనా బూస్టర్ డోస్ తీసుకోవాలంటే.. వారు తప్పకుండా డబ్బులు పెట్టుకుని తీసుకోవాల్సిందే. అయితే 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జులై 15 నుంచి 75 రోజుల పాటు అనగా అక్టోబర్ 13 వరకు దేశప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వాక్సీన్ అందిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా ముందుగా ఏ వాక్సీన్ తీసుకున్న వారు అదే వాక్సీన్ తోసుకోవాలన్న నిబంధనలు కొనసాగుతున్న తరుణంలో కాసింత వెసలుబాటు కల్పించింది కేంద్రం.
గతంలోని రెండు డోసులు కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 18 ఏళ్లకు పైబడిన వారు కొవాగ్జిన్ గానీ, కొవిషీల్డ్ గానీ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కోర్బెవాక్స్ ను బూస్టర్ డోసుగా ఇవ్వొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ప్రధాన వ్యాక్సిన్ కాకుండా బూస్టర్ డోసుగా మరో వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమం. కోర్బెవాక్స్ ను హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more