ఒక కూలీకి కోటీశ్వరుడయ్యాడు. అంతలోనే అతని విధి రాత మారిపోయింది. కొన్ని గంటల పాటు ఉన్న ఈ ఆనందం ఆ తరువాత హరించుకుపోయింది. అందుకు కారణం బ్యాంకు అధికారులే. కూలికి చెందిన బ్యాంకు అకౌంట్లో ఒకటి రెండు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలను వేశారు. ఇందుకు సంబంధించిన మెసేజ్ అతనికి చేరింది. దీంతో తొలుత షాకైన కూలీ.. బ్యాంకుకు వెళ్లి కొద్దిగా డబ్బు తీసుకుందామని భావించేలోపు సంతోషం పోయి సన్నగిల్లపడ్డాడు. కూలికి చెందిన జన్ధన్ ఖాతాలో పడిన వేల కోట్ల రూపాయలు వచ్చినట్టే వచ్చి.. అంతలోనే చేజారిపోయాయి.
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. 45 ఏళ్ల బీహారీ లాల్ రాజస్థాన్లోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. రోజుకు రూ.600 నుంచి రూ.800 సంపాదించేవాడు. అయితే వర్షాల వల్ల ఆ ఇటుక బట్టీ మూతపడింది. దీంతో అతడు కన్నౌజ్ జిల్లాలోని సొంత ఊరికి ఇటీవల తిరిగి వచ్చాడు. కాగా, బీహారీ లాల్ రెండు రోజుల కిందట స్థానిక జన సేవా కేంద్రానికి వెళ్లాడు. తన జన్ధన్ బ్యాంకు ఖాతా నుంచి వంద రూపాయలు డ్రా చేశాడు. ఆ వెంటనే వచ్చిన మెసేజ్ తో అతనికి అసలు విషయం తెలిసింది.
అతడి మొబైల్ ఫోన్కు వచ్చిన మెసేజ్లో తన బ్యాంకు ఖాతాలో రూ.2,700 కోట్లు బ్యాలెన్స్ ఉన్నట్లు గమనించాడు. వెంటనే బ్యాంకు మిత్రా సిబ్బంది వద్దకు వెళ్లాడు. తన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయో చూడాలని కోరాడు. మరోవైపు బ్యాంక్ మిత్రా వ్యక్తి బీహారీ లాల్ బ్యాంకు ఖాతాను ఒకటికి మూడుసార్లు పరిశీలించాడు. అతడి జన్ధన్ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నాయని చెప్పాడు. దీనికి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ తీసి ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా కోటీశ్వరుడు కావడంపై బీహారీ లాల్ ఆశ్చర్యపోవడంతోపాటు సంబరపడిపోయాడు.
అయితే అతడి ఆనందం కొన్ని గంటల్లో ఆవిరైంది. బీహారీ లాల్ ఆ తర్వాత తన బ్యాంకు బ్రాంచ్కు వెళ్లాడు. అక్కడ జన్ధన్ ఖాతా బ్యాలెన్స్ను చెక్ చేసుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.126 మాత్రమే ఉండటం చూసి నిరాశ చెందాడు. తన ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్లు మొబైల్కు వచ్చిన మెసేజ్తోపాటు స్టేట్మెంట్ ప్రింట్ను బ్యాంకు అధికారికి చూపించాడు. అయితే బ్యాంకింగ్ పొరపాటు వల్ల ఇలా జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దర్యాప్తు కోసం బీహారీ లాల్ బ్యాంక్ ఖాతాను కొంతసేపు స్తంభింపజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more