అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో లభించిన బెస్ట్ డీల్స్ ను తగు సమాచారం లేకనో, లేక చేతిలో తగినంత డబ్బు లేకనో అవకాశాన్ని చేజార్చుకున్న కస్టమర్లు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెజాన్ మరోమారు తాజాగా తన వార్షిక సేల్ ను తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తెస్తుంది. అమెజాన్ తన వార్షిక గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్కు ఆగస్ట్ 6 నుంచి 10 వరకూ ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో ప్రైమ్ డే సేల్ లో అవకాశాలను చేజార్చుకున్న కస్టమర్లు ఈ వార్షికోత్సవ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అమెజాన్ గ్రేట్ ఫ్రిడమ్ పెస్టివల్ సేల్ కొనసాగనుండగా.. ఈ సేల్ లోనూ అమెజాన్ తమ కస్టమర్లకు ఏకంగా పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై 40శాతం వరకు డిస్కౌంట్ సేల్ అందించనుంది. ఎంపిక చేయబడిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఈ డిస్కౌంట్ను ఈ కామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్లో భాగంగా అమెజాన్ ఇండియా ఎస్బీఐ కార్డులపై పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా ఎంపిక చేసిన ఉత్పత్తులపై రెగ్యులర్ డిస్కౌంట్స్, ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని వారు ఫ్రీడం ఫెస్టివల్ సేల్లో తక్కువ ధరకే తాము కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయవచ్చు. రక్షా బంధన్ కూడా రానుండటంతో ఈ సీజన్లో అమెజాన్ సేల్ మెరుగైన అవకాశంగా ముందుకొస్తోంది. ఫోన్లు, ఇతర ప్రోడక్ట్స్పై అమెజాన్ సేల్లో నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్లతో పాటు ల్యాప్టాప్లపైనా అమెజాన్ మెరుగైన డీల్స్, ఆఫర్లను అందిస్తోంది. హెడ్ఫోన్లపై 75 శాతం వరకూ, ల్యాప్టాప్లపై 40 శాతం, ట్యాబ్లెట్లపై 45 శాతం వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more