నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో దేశంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. కేంద్రప్రభుత్వ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్మతమైన ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టింది. కాగా, ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ‘‘ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య@2047’’ పథకంలో భాగంగా ఈ ప్రాజక్టును నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును జాతికి అంకితమిస్తున్న సందర్భంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు తెలంగాణలో ఆవిష్కృతం కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించడానికి కాస్తంత ముందుగా ప్రాజెక్టు వివరాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ జలాశయంలో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 100 మోగావాట్ల సామర్థ్యంలో రూ.423 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మేక్ ఇన్ ఇండియా క్రింద దేశంలోనే తయారు చేసిన 4.5 లక్షలకు పైగా సోలార్ ప్యానెళ్లతో 40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుందని ఆయన వివరించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ ను సరఫరా చేయవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టు వలన సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుందన్న కిషన్ రెడ్డి.. ఈ ప్రాజెక్టుల వల్ల 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నిరోధిస్తుందని వివరించారు. ఇటువంటి పర్యావరణ సహిత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండటం మనందరికీ గర్వకారణని ఆయన పేర్కొన్నారు. రామగుండం అంటే విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గును అందించే ప్రాంతంగా ఉన్న గుర్తింపును ఇకపై విద్యుత్ ఉత్సాదకతగా మారుతుందని కిషన్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more