రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. రాష్ట్రపతిపై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా లోక్సభలో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో గళం వినిపించారు. అటు రాజ్యసభలోను ఈ వ్యాఖ్యలపై బీజేపి నిరసన తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తక్షణం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణలు కోరాలని బీజేపి డిమాండ్ చేసింది. రాష్ట్రపతి పదవిలో ఉన్న గిరిజన మహిళను కాంగ్రెస్ కావాలనే అవమానించిందని బీజేపి అరోపించింది.
ధరాఘాతం, దిగజారుతున్న రూపాయి. జీఎస్టీల బాదుడు.. ప్రజలకు అందించాల్సిన సబ్సీడీల ఉపసంహరణ ఇత్యాధి అంశాలకు వ్యతిరేకంగా విపక్షాలు ధర్నాకు దిగాయి. ఈమేరకు నిరసన తెలిపిన విపక్షాలు బుధవారం రోజున రాష్ట్రపతి భవన్ కు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని కార్యక్రమాన్ని రూపోందించాయి. అంతకుముందు రోజు కూడా ఇదే విధమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టగా దానిని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దీంతో బుధవారం కూడా భగ్నం చేస్తారా.? అయితే మీరెలా వ్యవహరిస్తారు.? అంటూ మీడియా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీని ప్రశ్నించింది. దీంతో స్పందించిన అధీర్ రంజన్ నోరుజారారు.
రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై అధికార బీజేపీ భగ్గుమంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ అవమానించిందని.. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఇంతకన్నా ఏం చేసిందని.. గిరిజనులను, అదివాసీలను అవమానించడం తప్ప.. అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామణ్, స్మృతిఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు. సోనియా గాంధీ తమ పార్టీ సీనియర్ సభ్యుల పట్ల సభలో దగ్ధత స్వరంతో తవ్రంగా మండిపడ్డారని.. ఇది కూడా సభ్యులను అవమానించడమేనని అన్నారు.
#WATCH | "He has already apologised," says Congress interim president Sonia Gandhi on party's Adhir Chowdhury's 'Rashtrapatni' remark against President Droupadi Murmu pic.twitter.com/YHeBkIPe9a
— ANI (@ANI) July 28, 2022
కాగా, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని చెప్పిన అధిర్ రంజన్.. అయితే అవి కావాలని చేసిన వ్యాఖ్యలు కాదని.. నోరుజారి తప్పుగా వచ్చిన వ్యాఖ్యలు మాత్రమేనని అన్నారు. తాను నోరుజారి ఒక్కసారి చేసిన వ్యాఖ్యలను బీజేపి నేతలు పలుమార్లు ఉచ్చరించి.. వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. అప్పటికీ ఈ అంశం చల్లారక పోవడంతో ‘తన వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ ఆవేశంగా మాట్లాడారాయన. ఇప్పటికే అధిర్ రంజన్ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చినా.. అధికార పక్షం శాంతించలేదు.
In another low, Leader of #Congress in LS, Adhir Ranjan Chowdhury, condescendingly refers to President Droupadi Murmu as “राष्ट्रपत्नी”.
— Ramanathan B (@ramanathan_b) July 28, 2022
Shameful indeed pic.twitter.com/k0yAnsLNRu
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more