పాలు, పెరుగు సహా పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్ను విధించటాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నిరసనల బాట పట్టింది. నూతన సాగు చట్టాలను రైతుల ఏడాదికిపైగా నిరసన దీక్ష కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తీసుకున్న కేంద్రం.. వారిపై మరో విధంగా కక్షసాదింపు చర్యలు తీసుకుంటుందా.? అంటే ఔననే అంటున్నారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు తెలపడానికి పూనుకోవాలని అన్నారు. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాలు, పాల ఉత్పత్తులపైన కేంద్రం మొదటిసారి జీఎస్టీ విధించిందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ నిర్ణయంపై పార్టీశ్రేణులు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడంపట్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ.. అన్నిజిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా పాడి రైతులను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డారు.
ప్రధాని నరేంద్రమోదీ ద్రవ్యోల్బణాన్ని, చొరబాటును నియంత్రించలేక పోతున్నారని విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని.. శాటిలైట్ ఫొటోలతో మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ పోస్ట్ చేశారు. దేశాన్ని కాపాడుకోలేని ప్రధానిని ఏమని పిలవాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధానమంత్రిని ఏమని పిలవాలో చెప్పాలని కోరుతూ నాలుగు ఆప్షన్లను ట్వీట్ చేశారు. ఎ. 56” బి. విశ్వగురు సి. అచ్చేదిన్ వాలే డి. పైన పేర్కొన్నవన్నీ అన్పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more