తెలంగాణ వ్యాప్తంగా గత పక్షం రోజులుగా వర్షాలు కురుస్తున్న వర్షాల నుంచి అలా ఉపశమనం పోందామని రాష్ట్రప్రజలు భావిస్తుండగానే మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే గోదావరి ఉగ్రరూపం దాల్చి, భద్రచలం వద్ద తీవ్రస్థాయికి చేరి.. వరదలతో ఉద్దృతి తగ్గడంతో కాసింత శాంతించింది. ఈ నేపథ్యంలో మరోమారు తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని.. రేపటి నుంచి ఓ మోస్తారు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. సముద్రంలోకి వెళ్లినట్టే వెళ్లి మళ్లీ భూమి ఉపరితలంపైకి రావడం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లిన అల్పపీడనం మళ్లీ భూమి ఉపరితలంపైకి క్రితం రోజు సాయంత్రం వచ్చి మరోమారు ఒడిశా తీరంపై కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు భారీగా, రేపు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
మరీ ముఖ్యంగా కరీంనగర్, కుమరంభీమ్ అసీఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగంల్ అర్భన్, జనగాం జిల్లాల్లో దీంతో లోత్తట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిన.. జిల్లాల యంత్రాంగం, రెన్క్యూ టీమ్ లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. భద్రాచలం పరివాహిక ప్రాంతంతో పాటు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ గా ఉణ్నారు. ఏక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తినా వెంటనే అదుకునేందుకు హెలికాప్టర్లను కూడా సిద్దం చేశారు. జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. జనజీవనం స్తంభించింది. రహదారులు నదులను తలపిస్తున్నాయి.
ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఈ ఆర్మీ బృందం పునరావాస చర్యలలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరినట్లు సోమేశ్ కుమార్ చెప్పారు. దీంతో 68 మంది సభ్యులుగల ఇంఫ్రాన్ట్రీ, 10 మంది సభ్యులుగల వైద్య బృందం, 23 మంది సభ్యులుగల ఇంజనీరింగ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భద్రర్డీ కొత్త గూడెం జిల్లాకు వస్తున్నాయని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more