ఆటోలో ప్రయాణం ఎంతో ప్రమాదకరం అన్న స్థితి నుంచి అటోలో ప్రయాణం కూడా ఒక భాగం అన్న స్థాయికి చేరుకున్నాం. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందాం. రోడ్లు కూడా విశాలంగా మారాయి. అయితే అటోలలో అధికమంది లైన్సెన్సు కలిగిన వారు డ్రైవర్లు ఉండటంతో ప్రమాదాలు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే ఒక్కోసారి అటోలు అదుపు తప్పడం అన్నది చూస్తూనే ఉన్నాం. అందుకు కారణం ఆటో డ్రైవర్ల అతివేగం.. లేదా అదుపు తప్పేలా అటోల్లో ప్యాసింజర్లను ఇరికించి మరీ కూర్చోబెట్టడం కూడా కావచ్చు. నగరావాసులకు వినడానికే విచిత్రంగా ఉన్నా.. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో మాత్రం ఈ పరిస్థితి నెలకొన్నదన్నది కాదనలేని సత్యం.
అటోలో డ్రైవరు కలుపుకుని నలుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఆటోలో ఏకంగా పది మంది ప్రయాణించడం చూస్తుంటాం. డ్రైవర్ మరీ కక్కుర్తి పడేవాడే అయితే..ఏకంగా 12 మంది వారకు ప్రయాణిస్తారు. అంతేకానీ ఏకంగా గెన్నీస్ రికార్డు తరహాలో ఒక్క అటోలో ఏకంగా 27 మంది ప్రయాణించడం ఎక్కడైనా చూశారా.? ఉత్తర్ ప్రదేశ్ లో ఆ ఘట్టం కూడా అవిష్కృతమైంది. యూపీలోని ఓ ఆటో రిక్షాలో కూర్చున్న ప్యాసింజర్లను చూసి పోలీసులే షాకయ్యారు. 7 సీటర్లో ఏకంగా 27 మంది కూర్చొని ఉండగా, ఓవర్స్పీడ్తో ప్రయాణిస్తున్న ఆటోను ఆపి చూసిన పోలీసులకు మతిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫతేపూర్లోని బింద్కీ కొత్వాలి ప్రాంతంలో ఈ ఆటో కనిపించింది. ఇందులో కేవలం ఏడురుగు మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉండగా.. ఆ డ్రైవర్ వృద్ధులు, చిన్నారులు సహా 27 మందిని ఎక్కించాడు. అంగుళంకూడా గ్యాప్ లేకుండా అందరూ ఇరికిరుకుగా కూర్చున్నారు. పోలీసులు వారందరినీ కిందికి దించి లెక్కించారు. అనంతరం డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ఈ వీడియోకు 85.1 వేల వ్యూస్ రాగా, 3వేల మంది షేర్ చేశారు. అంతమందితోనూ ఆ ఆటో ఓవర్స్పీడ్ వెళ్తోందంటే దీన్ని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కించాల్సేందనని ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు.
जनसंख्या विस्फोट का दुष्परिणाम
— Ashwini Upadhyay (@AshwiniUpadhyay) July 11, 2022
ऑटो एक और सवारी सत्ताईसpic.twitter.com/ex7QCiRJTp
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more